తదర్శకుడు ఆదిత్య ధర్, కథానాయకుడు రణవీర్ సింగ్లను ప్రశంసిస్తూ బ్లాక్బస్టర్ చిత్రం ‘ధురందర్ 2’ తన జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్ అనుభవం’ అని భారత్ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కొనియాడారు. ఈ సినిమాను చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ భారత్ లో ఇలాంటి సినిమా అనుభవాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని స్పష్టం చేశారు.
దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగిందని, ఒక్క నిమిషం కూడా కళ్లు తిప్పుకోలేకపోయానని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ధురందర్ 2’ పోస్టర్ను పోస్ట్ చేసిన విరాట్.. ” ఈ రోజే సినిమా చూశాను. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా అనుభవం భారత్ లో ఇంతకుముందెన్నడూ చూడలేదని కచ్చితంగా చెప్పగలను” అని చెప్పారు.
“దాదాపు 4 గంటలపాటు కనురెప్ప వేయకుండా చూశాను. నాలో ప్రతి భావోద్వేగాన్ని ఈ సినిమా తట్టిలేపింది. డైరెక్టర్ ఆదిత్యా ధర్ మీ ప్రతిభ, పట్టుదల మీరు సృష్టించిన ఈ అద్భుతంలో కనిపిస్తున్నాయి. మీకు నా హ్యాట్సాఫ్. మీరు ఒక జీనియస్” అంటూ కోహ్లీ అభినందనలు కురిపించారు. “ఇక నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయినప్పటికీ రణవీర్ ఈ సినిమా తర్వాత మీరు ఒక కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. మీ నటన అద్భుతానికి మించి ఉంది. అబ్సల్యూట్లీ వావ్! ” అని రాసుకొచ్చారు.
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ దీని కథనం ఆకట్టుకునేలా ఉందని, దాని నిర్మాణంలో ఉన్న నిశితమైన పనితనాన్ని ఇది ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు. ఆదిత్య ధర్ను ట్యాగ్ చేస్తూ, అనుష్క ఇలా రాసింది: “మీరు ఎంత అద్భుతమైన సినిమా తీశారు! దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమా తీయడానికి ఎంతో దృఢ సంకల్పం కావాలి. ఆసక్తికరంగా, లీనమయ్యేలా, ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన ఈ సినిమా మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మీరు ఎంతో మౌలికమైన, ఆత్మవిశ్వాసం గల చిత్రనిర్మాత.”
మరోవైపు. బాక్సాఫీస్ వద్ద కూడా ‘ధురంధర్ 2’ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రయాణం ఆరంభం నుంచే ప్రభంజనం సృష్టించింది. జియో స్టూడియోస్ గణాంకాల ప్రకారం విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1622 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో విదేశీ వసూళ్లు ఏప్రిల్ 6 నాటికి రూ.394 కోట్లుగా ఉండగా, దేశీయంగా రూ.1228 కోట్ల గ్రాస్ (రూ. 1041 కోట్ల నెట్) వసూళ్లను రాబట్టింది. 18వ రోజున కూడా భారతవ్యాప్తంగా 14,229 షోల ద్వారా రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించి తన సత్తా చాటుతోంది.

More Stories
అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు సమర్ధించిన కేంద్రం
బెంగాల్పై కన్నేస్తే పాక్ ఎన్ని ముక్కలవుతుందో