పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరగడంతో, మార్చి నెలలో యూరప్ ద్రవ్యోల్బణం రేటు 2.5శాతానికి చేరింది. యురో కరెన్సీని ఉపయోగించే 21 యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 1.9శాతంగా ఉంది. యుద్ధం ప్రారంభమై పర్షియన్ గల్ఫ్ నుండి చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగించక ముందు ఈ రేటు నమోదైంది.
యూరోస్టాట్ గణాంకాల ప్రకారం, మార్చిలో ఇంధన ధరలు 4.9 శాతం పెరిగాయి, అయితే ఫిబ్రవరిలో 3.1 శాతం తగ్గుదల నమోదైంది. యుద్ధం ధరలపై చూపే ప్రభావం ఇప్పటికే రోమ్లోని వాటికన్ నార్త్ వైపు ఉన్న ట్రియోంఫేల్ ఇండోర్ మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆహార ధరల ద్రవ్యోల్బణం సాపేక్షంగా 2.4శాతం వద్ద ఉంది, అయితే వైద్య సంరక్షణ నుండి కేశాలంకరణ వరకు విస్తృతమైన సేవలకు సంబంధించి 3.2శాతం పెరిగింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టీన్ లగార్డ్ మాట్లాడుతూ, 2022లో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి పెరిగినప్పుడు, ఇంత ప్రభావం లేదని, అయితే ఇప్పటి ద్రవ్యోల్బణంతో ధరలను వేగంగా పెరుగుతాయని తెలిపారు.
రష్యా యూరప్కు సహజ వాయువు సరఫరాను నిలిపివేసింది, చమురు ధరలు పెరిగాయి, ఇంధన ఖర్చులు ఆకాశాన్ని అంటాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాను నిలిపేసింది, ఇది ప్రపంచ చమురు, గ్యాస్లో సుమారు 20 శాతం సాధారణంగా వెళ్లే జలమార్గం. ఇది రాబోయే వారాలు, నెలల్లో ఇంధన మార్కెట్లలో తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది.
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) అంచనాల కంటే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధిక వేతనాలు, ఇతర వస్తువుల ధరల అంచనాల ద్వారా ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో స్థిరపడకుండా నిరోధించడానికి ఇసిబి రాబోయే నెలల్లో వడ్డీ రేట్లను పెంచుతుందని వారు భావిస్తున్నారు.
”ద్రవ్యోల్బణం అంచనాలు స్థిరపడకుండా నిరోధించడానికి ఏప్రిల్, జూన్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలలో ఇసిబి ఇప్పటికే రేట్లను పెంచుతుందని మేము ఆశిస్తున్నాము,” అని ఎబిఎం బ్యాంక్ రీసెర్చ్ హెడ్ బిల్ డివైన్ పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విశ్లేషకులు కూడా ఈ సంవత్సరం వడ్డీ రేట్ల పెరుగుతాయని ప్రకటించడం గమనార్హం.

More Stories
చైనా సీసీటీవీ కెమెరాలపై భారత్ లో నిషేధం!
విమాన ఇంధనం ధరలు రెట్టింపు, వాణిజ్య గ్యాస్ రూ 195.50 పెంపు
ఇండిగో సిఇఒ గా బ్రిటీష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్ విలియం వాల్ష్