* లెబనాన్లో ఐడీఎఫ్ గ్రౌండ్ ఆపరేషన్ * దుబాయ్ లో ఇంధన టాంకర్ పై దాడి
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయల్ దళాలు నిర్వహిస్తున్న దాడిని పోప్ లియో ఖండిస్ట్ తక్షణమే యుద్ధాన్ని విరమించాలని కోరారు. హింస ద్వార స్థిరత్వాన్ని ఎన్నటికీ సాధించలేరని స్పష్టం చేశారు. వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరిగిన ప్రార్థనల్లో ఆయన ప్రసంగీస్తూ పశ్చిమాసియా ప్రజలు రెండు వారాలుగా భయానకమైన హింసను అనుభవించినట్లు చెప్పారు.
“మధ్యప్రాచ్య క్రైస్తవుల తరపున, అలాగే సద్భావన కలిగిన స్త్రీ పురుషులందరి తరపున, ఈ సంఘర్షణకు బాధ్యులైన వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను,” అని లియో పేర్కొన్నారు. “చర్చలకు మార్గాలు తిరిగి తెరుచుకునేలా కాల్పులను విరమించండి. ప్రజలు ఆశిస్తున్న న్యాయం, స్థిరత్వం, శాంతిని హింస ఎన్నటికీ సాధించిపెట్టలేదు” అని హితవు చెప్పారు. దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల తరపున ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు.
స్కూళ్లు, ఆస్పత్రులు, రెసిడెన్షియల్ ప్రాంతాలపై జరిగిన దాడుల వల్ల అనేక మంది మరణించినట్లు చెప్పారు. హింసతో న్యాయం జరగదు అని, స్థిరత్వం, శాంతి స్థాపించలేరని హెచ్చరించారు. యుద్ధంతో వివాదాలను పరిష్కరించే ప్రక్రియ సరైంది కాదని వారించారు.
మరోవంక, లెబనాన్లోని హిజ్బొల్లా మిలిటెంట్లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ఉత్తర ఇజ్రాయెల్లోని నివాసితుల రక్షణ కోసం గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. లెబనాన్లో ఉన్న ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
సైనిక బలగాలు లెబనాన్లో అడుగుపెట్టడానికి ముందు కీలక ప్రాంతాలపై వైమానిక దాడలు చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. చాలా వరకు ఉగ్రవాద లక్ష్యాలను పేల్చివేసినట్లు పేర్కొన్నది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్బొల్లా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్లో సుమారు 800 మంది పౌరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంట్లో వందకుపైగా చిన్నారులు ఉన్నారు.

More Stories
పంజాబ్ లో ఆప్ `విద్యా విప్లవం’… ఎమ్యెల్యేల పిల్లలు ప్రైవేట్ బడుల్లోనే
తైవాన్ వద్ద భారీగా చైనా యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు
నాటో దేశాలపై నిప్పులు చెరిగిన ట్రంప్