* 300 క్షిపణులు ప్రయోగించిన ఇరాన్.. 16 నౌకలను పేల్చేసిన అమెరికా
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12వ రోజుకు చేరుకుంది. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ సెంట్రల్ ఆపరేషనల్ కమాండ్ ఖాటమ్ అల్ అన్బియా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ సంస్తలు, బ్యాంకులకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక కీలక బ్యాంకుపై ఇజ్రాయెల్ అర్ధరాత్రి దాడి చేసింది. ఈ ఘటనలో చాలా మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము కూడా ఇలాగే అమెరికా, ఇజ్రాయెల్లకు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడి చేస్తామని, అక్కడి ప్రజలు ఆ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సహా గల్ఫ్ కంట్రీస్లోని అమెరికాకు చెందిన సంస్థలపై దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ దాడులకు సంబంధించి అమెరికన్ సంస్థల టార్గెట్ లిస్టును ఇరాన్ ప్రకటించింది. ఇందులో ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీలు, ఇన్ఫ్రా కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, పాలంటిర్, నివిడియా, ఒరాకిల్ వంటి సంస్థలున్నాయి.
ఈ సంస్థలు గల్ఫ్ దేశాలలో, ఇజ్రాయెల్లలో పలు ఆఫీసుల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు చమురు సంస్థలు, ఆర్థిక కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోవడంతో ఇండియా, చైనా వంటి పలు ఆసియా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
కాగా, ఇప్పటి వరకు ఇజ్రాయెల్పై ఇరాన్ సుమారు 300 బాలిస్టిక్ క్షిపణులను రిలీజ్ చేసింది. దాంట్లో సగం వరకు క్లస్టర్ బాంబులతో కూడి వార్హెడ్స్ ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొన్నది. మంగళవారం కూడా ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించింది. క్లస్టర్ బాంబుల్లో ఉన్న వార్హెడ్స్ అత్యంత ప్రమాదకరమైనవి. క్షిపణి పేలిన తర్వాత వాటి నుంచి పేలుడు పదార్ధాలు డజన్ల సంఖ్యలో వేరుపడుతాయి. =

More Stories
గ్యాస్ కొరత నియంత్రణపై భారత్ వ్యూహాత్మక ప్రణాళిక
ఓంబిర్లాపై అవిశ్వాసం.. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం!
నకిలీ సమాచారం, భావ వ్యక్తీకరణపై సమతుల్యత అవసరం