ప్రపంచంలో ఇంధన సరఫరాకు జీవానాడి లాంటి హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ, శత్రుదేశాల నౌకలు ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే పేల్చేస్తామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. అంతకుముందే అమెరికాకు అనుకూలంగా ఉండే పలావు దేశానికి చెందిన జెండాతో వెళ్తున్న ఓ చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఆ నౌకలో 15 మంది భారతీయులు, నలుగురు ఇరానీలు ఉండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.
ఇరాన్ హెచ్చరికలు, దాడుల నేపథ్యంలో పలు చమురు నౌకలు అనుమతి కోసం హార్ముజ్ జలసంధికి రెండు వైపుల నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇరాన్ చైనా చమురు నౌకలు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా తమకు అనుకూలంగా ఉన్నందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఈ క్రమంలో గురువారం భారత చమురు నౌకలకు హార్ముజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అక్కడ వేచి ఉన్న 37 భారత నౌకలు, 1109 మంది నావికులు జలసంధిని దాటే అవకాశం లభించినట్లవుతుంది. కాగా, హార్ముజ్ జలసంధిని అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా, ఇతర పాశ్చాత్య మిత్రదేశాల నౌకలకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) ప్రకటించింది.
సంఘర్షణ సమయాల్లో ఇరాన్ మార్గాన్ని నియంత్రించడానికి అనుమతించే అంతర్జాతీయ చట్టాలను ఈ సందర్భంగా ఉటంకించింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళకుండా భారత నౌకలను నిరోధించదని ఇది సూచిస్తుంది. ఈ పరిణామం ధృవీకరించబడితే, ఈ పరిణామం న్యూఢిల్లీకి గణనీయమైన ఉపశమనం కలిగించవచ్చు.

More Stories
మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇబ్బందులే?
బెంగాల్ గవర్నర్ రాజీనామా.. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
ఎనిమిది వారాలకు ముడి చమురు, పెట్రోలియం నిల్వలు