భారత సోలార్‌ ఉత్పత్తులపై 125% సుంకాలు!

భారత సోలార్‌ ఉత్పత్తులపై 125% సుంకాలు!
వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ భారత్‌పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్నది. భారత సోలార్‌ ఉత్పత్తులపై ప్రాథమికంగా 125.87 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం అసంబద్ధంగా సబ్సిడీలు అందిస్తున్నదని ఆరోపించింది.  అదానీ గ్రూప్ కంపెనీలు ముంద్రా సోలార్ ఎనర్జీ, ముంద్రా సోలార్ పివి దర్యాప్తు చర్యల నుండి వైదొలిగిన తర్వాత, యుఎస్ వాణిజ్య శాఖ భారతీయ సౌర ఉత్పత్తులపై 126 శాతం సుంకాన్ని విధించిందని ప్రాథమిక సబ్సిడీ వ్యతిరేక దర్యాప్తు నివేదిక చూపిస్తుంది. 
అదానీ గ్రూప్ కంపెనీలు ఈ కార్యకలాపాలలో ‘తప్పనిసరి ప్రతివాదులు’గా ఉన్నాయి. వారి సహకారం లేకపోవడం వల్ల యుఎస్ వాణిజ్య శాఖ ఉపయోగించే అత్యంత కఠినమైన పద్ధతి ‘అందుబాటులో ఉన్న ప్రతికూల వాస్తవాలు’ జరిమానా విదించడంగా భావిస్తున్నారు.  భారత సౌర ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తూనే, అమెరికా వాణిజ్య శాఖ భారతదేశం చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని కూడా ఎత్తి చూపింది. 
“అందుతున్న సమాచారం ప్రకారం, భారత సౌర ఉట్పత్తుల పరిశ్రమ చైనా నుండి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది.  భారతదేశంలో చైనా పెట్టుబడులు చైనా సౌర పరిశ్రమ కంబోడియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాంలలో ఉత్పత్తి సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టే ధోరణిని అనుసరిస్తాయి” అని నివేదిక పేర్కొంది.  ఇండోనేషియా, లావోస్‌ నుంచి దిగుమతి అవుతున్న సోలార్‌ గూడ్స్‌పైనా కూడా సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది.
ఇండో నేషియాపై 104 శాతం, లావోస్‌పై 80 శాతం డ్యూటీ విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 24న అన్ని దేశాలపై ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించిన 10 శాతం సుంకాలకు తాజాగా ప్రకటించిన టారిఫ్‌లు అదనం. సబ్సిడీ దిగుమతుల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని అమెరికా సోలార్‌ అలయన్స్‌ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ట్రంప్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. 
 
ట్రంప్‌ విధించిన సుంకాలను అమెరికా సోలార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ట్రేడ్‌ అలయన్స్‌ కొనియాడింది.‘దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు అమెరికా తయారీదారులు బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నారు. అనేక ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. అసంబద్ధ దిగుమతులను అనుమతిస్తే ఈ పెట్టుబడులు ఫలితాలనివ్వవు’ అని పేర్కొన్నది.
అమెరికా వాణిజ్య శాఖ డాటా ప్రకారం అమెరికాకు దిగుమతి అవుతున్న సోలార్‌ ఉత్పత్తుల్లో భారత్‌, ఇండోనేషియా, లావోస్‌ వాటానే అత్యధికం.
గత ఏడాది ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి దిగుమతి అయిన సోలార్‌ ప్యానెల్స్‌, సెల్‌ వంటి సోలార్‌ దిగుమతుల విలువ 4.5 బిలియన్‌ డాలర్లని ట్రేడ్‌ డాటా వెల్లడిస్తున్నది. 2025లో మొత్తం సోలార్‌ దిగుమతుల్లో ఇది మూడింట రెండొంతులు.  భారత్‌ నుంచి దిగుమతులు 2022లో 83.86 మిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2024 నాటికి అది 792.6 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది.