అమెరికా బెదిరింపులు ఆపకుంటే ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ ఘాటుగా సమాధానమిచ్చింది. అమెరికా తన బెదరింపులను, దాడులను ఆపకుంటే, ఆ దేశ సైనిక స్థావరాలు, మౌలికసదుపాయాలు, ఆస్తులు ‘చట్టబద్ధమైన లక్ష్యాలు’ అవుతాయని ఇరాన్ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ, అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్, భద్రతామండలి (యుఎన్ఎస్సి) అధ్యక్షుడికి రాసిన లేఖలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
మధ్యప్రాచ్యంలో అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనికులను మోహరించిన సంగతి తెలిసిందే. అయితే తాము ఈ చర్యలను అనుసరించబోమని స్పష్టం చేశారు. ”ఇరాన్ ఒప్పందం చేసుకోకూడదని నిర్ణయించుకుంటే హిందూమహాసముద్ర ద్వీపంలోని ఒక ద్వీపంతో సహా బ్రిటన్ సైనిక స్థావరాలను అమెరికా వినియోగించాల్సి వుంటుంది” అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ను ఉదహరించినట్లు లేఖ పేర్కొంది.
”ఇటువంటి యుద్ధోన్మాద ప్రకటన, సైనిక దురాక్రమణ నిజమైన ప్రమాదాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు ఈ ప్రాంతానికి విపత్కరం, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయి” అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా మండలి అమెరికా తన చట్టవిరుద్ధమైన బెదిరింపులను వెంటనే నిలిపివేసేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇరాన్ ”దౌత్యపరమైన పరిష్కారాలకు”, ”పరస్పర ప్రాతిపదికన, తమ శాంతియుత అణుకార్యక్రమానికి సంబంధించిన అస్పష్టతలను పరిష్కరిస్తూ కట్టుబడి ఉందని ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ సైనిక దురాక్రమణను ఎదుర్కొంటే, ” ప్రతిస్పందనగా అమెరికాలోని అన్ని సైనిక స్థావరాలు, మౌలికసదుపాయాలు, ఆస్తులు చట్టబద్ధమైన లక్ష్యాలుగా ఉంటాయి’’ అని హెచ్చరించారు.
తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. ఒకవైపు ఒప్పందంపై చర్చలు అంటూనే రెండు దేశాలూ యుద్ధ సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు ట్రంప్ 10-15 రోజుల్లో ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాలని అల్టిమేటమ్ ఇచ్చాడు. ఒప్పందంలో విఫలమైతే అమెరికా దాడి చేస్తుందని హెచ్చరించారు.

More Stories
భారత జాతీయ గీతం పాడిన నలుగురు పాక్ విద్యార్థులపై వేటు
వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో భారతీయ మహిళ
ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం.. ప్రిన్స్ ఛార్లెస్ సోదరుడు అరెస్టు