ఈ నెల 25, 26 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్లో ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం వెల్లడించారు. అమెరికాకు చెందిన యూదు సంస్థల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.
“ఇజ్రాయెల్, భారతదేశం మధ్య అద్భుతమైన మైత్రి నెలకొంది. అన్ని రకాల సహకారాన్ని చర్చించబోతున్నాము. ఇప్పుడు, మీకు తెలుసా, భారతదేశం ఒక చిన్న దేశం కాదు. దీనికి 1.4 బిలియన్ల ప్రజలు ఉన్నారు. భారతదేశం అపారమైన శక్తివంతమైనది, అపారమైన ప్రజాదరణ పొందింది” అని ఆయన నొక్కి చెప్పారు. ఇజ్రాయిల్కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా మోదీ పర్యటన విషయాన్ని ధృవీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.
అలాగే, గత కొన్ని నెలల నుంచి ఇజ్రాయిల్, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది నవంబర్లో ఇరు దేశాల మధ్య రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారం అంశాల్లో ఒక ఒప్పందం కుదిరింది.
కాగా, మోడీకి ఇదో రెండో ఇజ్రాయిల్ పర్యటన కానుంది. 2017లో మోదీ తొలిసారిగా అక్కడ పర్యటించారు.
ప్రధాని తాజా పర్యటనతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ, సాంకేతిక సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతాయని అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు వెస్ట్ ఆసియాలో భద్రతా పరిస్థితిపై ఉభయదేశాల ప్రధానులు చర్చించనున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై (బీఐటీ) కూడా ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయి.
గత ఏడాది నవంబర్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా స్వేచ్ఛ వాణిజ్యంకు దారితీసే నిబంధనల (టిఓఆర్)పై సంతకం చేసిన తర్వాత, సెప్టెంబర్లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ పర్యటన సందర్భంగా రెండు దేశాలు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశాయి.
అదే సంవత్సరం గోయల్ పర్యటన సందర్భంగా, భారతదేశం, ఇజ్రాయెల్ రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి ఒక మైలురాయి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. తద్వారా సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

More Stories
టీ20 ప్రపంచకప్లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్
పాక్ సైనికుల్ని బంధించిన బీఎల్ఏ.. ఆర్మీకి ఏడు రోజుల గడువు
ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలింపు