హాంగ్కాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లాయ్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హాంగ్కాంగ్ స్థానిక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. జాతీయ భద్రతా నేరానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. చైనా తన వివాదాస్పద జాతీయ భద్రత చట్టం కింద ఈ శిక్షను విధించింది. హాంగ్ కాంగ్ స్థిరత్వంగా కోసం ఈ శిక్ష తప్పదు అని చైనా చెబుతోంది.
జిమ్మీ లాయ్ వాస్తవానికి బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. అయితే ఆయన చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. యాపిల్ డెయిలీ పత్రికతో ఆయన చైనాకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు రాశారు. ఆ పత్రికలో పనిచేసిన మరో ఆరు మంది మాజీ ప్రతినిధులకు కూడా జైలుశిక్ష విధించారు. ఒక్కొక్కరికి ఆరు నుంచి 10 ఏళ్ల మధ్య శిక్ష పడింది. ప్రో డెమోక్రసీ ఉద్యమ నేతగా లాయ్ను గుర్తిస్తారు. కానీ చైనా మాత్రం ఆయన్ను దేశద్రోహిగా భావిస్తున్నది.
78 ఏళ్ల జిమ్మీ లాయ్పై అనేక కేసులు ఉన్నాయి. స్వేచ్ఛగా ఉన్న సిటీపై.. చైనా వత్తిడి తెచ్చినట్లు తన పత్రికలో కథనాలు రాశారు. విదేశీ శక్తులతో కలిసి దేశద్రోహానికి, కుట్రకు పాల్పడినట్లు జిమ్మీపై ఆరోపణలు ఉన్నాయి.
“హాంగ్ కాంగ్లో చట్టబద్ధమైన పాలన పూర్తిగా ధ్వంసమైంది. నేటి ఈ దారుణమైన నిర్ణయం హాంగ్ కాంగ్లో పత్రికా స్వేచ్ఛకు చివరి మేకు లాంటిది. ప్రపంచంలో ఎక్కడైనా పత్రికా స్వేచ్ఛ గౌరవించబడాలని మనం కోరుకుంటే, జిమ్మీ లాయ్ను విడుదల చేయడానికి అంతర్జాతీయ సమాజం తన ఒత్తిడిని పెంచాలి,” అని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) సీఈఓ జోడీ గిన్స్బర్గ్ పిలుపిచ్చారు.
ప్రజాస్వామ్య అనుకూల ఆపిల్ డైలీ వ్యవస్థాపకుడు లై ఆరోగ్యం క్షీణిస్తోందనే ఆందోళనల మధ్య 2020 నుండి జైలులో ఉన్నాడు. డిసెంబర్ 15న విదేశీ శక్తులతో కుట్ర పన్నినందుకు రెండు అభియోగాలు, దేశద్రోహ విషయాలను ప్రచురించడానికి కుట్ర పన్నినందుకు ఒక అభియోగంపై లైని దోషిగా నిర్ధారించారు. బీజింగ్ విధించిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టం కింద డిసెంబర్ 2020లో అతన్ని అరెస్టు చేశారు.

More Stories
జె ఎన్ యు విద్యార్థి సంఘం నేతల బహిష్కరణ
అమెరికాతో బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ రహస్య లాలూచి
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో తేజస్విన్ శంకర్ కు స్వర్ణం