బిరెన్ సింగ్ రాజీనామా, జాతి హింస మధ్య రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏర్పడిన ఏడాది కాలపు శూన్యం అనంతరం మణిపూర్ తన తదుపరి ముఖ్యమంత్రిని పొందడానికి సిద్ధంగా ఉంది. మంగళవారంఖేమ్చంద్ సింగ్ను మణిపూర్ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 62 ఏళ్ల యుమ్నం ఖేమ్చంద్ సింగ్ ఇప్పుడు మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ఈశాన్య రాష్ట్రంలో బీజేపీకి చెందిన రెండో ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మణిపుర్ కొత్త ప్రభుత్వంలో కుకీ మహిళా నాయకురాలు నెమ్చా కిప్గెన్ ఉపముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి చేరుకుని, మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుపై అమిత్ షాతో సహా పార్టీ కేంద్ర నాయకత్వంతో విస్తృత చర్చలు జరిపింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు సింగ్ను నాయకుడిగా ఎన్నుకున్నారు.
రెండేళ్లకుపైగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో ఏడాది కిందట ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా కేమ్చంద్కు అవకాశం కల్పించింది
యుమ్నం ఖేమ్చంద్ సింగ్ బీజేపీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. మణిపూర్ రాజకీయ రంగంలో ప్రముఖ నాయకుడు. ఆయన 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఇంఫాల్ వెస్ట్లోని సింగ్జమే నియోజకవర్గం నుండి మణిపూర్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన మార్చి 2017 నుండి మార్చి 2022 వరకు మణిపూర్ శాసనసభ స్పీకర్గా పనిచేశారు.
రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక సమయంలో శాసనసభ కార్యకలాపాలను పర్యవేక్షించారు. అసెంబ్లీ వ్యవహారాలను నిర్వహించారు. 2022 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మెజారిటీ సాధించిన తర్వాత, సింగ్ బిరెన్ సింగ్ ప్రభుత్వ రెండవ పర్యాయంలో క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పాత్రలో, మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించే వరకు, అంటే ఫిబ్రవరి 2025 వరకు ఆయన మునిసిపల్ పరిపాలన, గృహనిర్మాణ అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, విద్య శాఖల బాధ్యతలను నిర్వహించారు.
రాజకీయాలకు అతీతంగా, ఖేమ్చంద్ సింగ్కు మార్షల్ ఆర్ట్స్పై దీర్ఘకాలంగా వ్యక్తిగత ఆసక్తి ఉంది. డిసెంబర్ 2025లో, ఆయన 16 సంవత్సరాల వయస్సులో శిక్షణ ప్రారంభించినప్పటి నుండి క్రమశిక్షణ పట్ల ఆయన దశాబ్దాల అంకితభావాన్ని గుర్తించి, సియోల్లోని గ్లోబల్ ట్రెడిషనల్ టైక్వాండో ఫెడరేషన్ ద్వారా సాంప్రదాయ టైక్వాండోలో ఐదవ-డాన్ బ్లాక్ బెల్ట్ పొందిన మొదటి భారతీయుడు అయ్యారు.
కాగా మణిపుర్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు మాత్రమే ఉంది. మణిపుర్లో 2025 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. రెండో విడత పొడిగించిన రాష్ట్రపతి పాలన గడువు ఫిబ్రవరి 12తో ముగియనున్న సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
60 స్థానాలు ఉన్న మణిపుర్ అసెంబ్లీలో, బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. (వాస్తవానికి 2022 ఎన్నికల్లో మొదట బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా, తరువాత ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో చేరారు.) కాగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)- 6, నాగా పీపుల్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)- 5, కాంగ్రెస్- 5, కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ)- 2, జనతాదళ్ (యునైటెడ్)కు 1 ఎమ్మెల్యే, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో ఆ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది.
More Stories
`చికెన్స్ నెక్’ కారిడార్ వెంబడి భూగర్భ రైలు మార్గం
హెలికాప్టర్ల తయారీకి అదానీ, లియోనార్డో మధ్య ఒప్పందం
లోక్సభలో చైర్పై పేపర్లు విసిరేసిన 8 మంది ఎంపీల సస్పెన్షన్