దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళకు 20 నెలలు జైలు 

దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళకు 20 నెలలు జైలు 
అవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళ కిమ్‌ కియోన్‌ హీకి కోర్టు బుధవారం 20 నెలల జైలు శిక్ష విధించింది. వ్యాపార ప్రయోజనాల కోసం యూనిఫికేషన్‌ చర్చి నుండి లంచాలు తీసుకున్నందుకు సియోల్‌ సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు తీర్పునిచ్చింది. గతేడాది మాజీ అధ్యక్షుడు యూన్‌సుక్‌ యోల్‌ దేశంలో మార్షల్‌ లా విధించినందుకు, కుంభకోణాలకు పాల్పడిన కేసుల్లో మరో మూడు వారాల్లో తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే. 
 
స్టాక్‌ ధరల తారుమారు, రాజకీయనిధుల చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు యున్‌ సుక్‌ యోల్‌ భార్య కిమ్‌కి కోర్టు ఈ శిక్ష విధించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ కొరియా యునిఫికేషన్‌ చర్చి నుండి లగ్జరీ చానెల్‌ బ్యాగ్‌లు, డైమండ్‌ నెక్లెస్‌ను స్వీకరించడం వంటి ఆరోపణలపై ఆమెకు న్యాయవాదులు 15 ఏళ్ల జైలుశిక్ష, 2.9బిలియన్ల జరిమానా (2మిలియన్‌ డాలర్లు) విధించాలని డిమాండ్‌ చేశారు.
 
స్టాక్‌ ధరలను మార్చడం, రాజకీయ నిధుల చట్టాలను ఉల్లంఘించిన కేసుల్లో కిమ్‌ను దోషిగా నిర్థారించడానికి తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను కిమ్‌ ఖండించారు. న్యాయవాదుల బృందం తీర్పునుసమీక్షించి, అప్పీల్‌ చేయాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయించన్నుట్లు ఆమె తెలిపింది.
“ఒక అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల, ఒక ప్రథమ మహిళఆయనపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. అధ్యక్షుడితో కలిసి దేశాన్ని ప్రాతినిధ్యం వహించే ప్రతీకాత్మక వ్యక్తి” అని కోర్టు టెలివిజన్ తీర్పులో పేర్కొంది. “కానీ నిందితురాలు వ్యక్తిగత లాభాలను పొందేందుకు తన స్థానాన్ని ఉపయోగించుకుంది.” కోర్టు అభిప్రాయాన్ని “వినయంగా అంగీకరిస్తాను” అని, “ఆందోళనలు కలిగించినందుకు అందరికీ మళ్ళీ క్షమాపణలు చెబుతాను” అని కిమ్ తన న్యాయవాదుల ద్వారా చెప్పింది. 
 
2024 డిసెంబర్‌లో యూన్ సైనిక చట్టం పరాజయం పాలైన తర్వాత, నెలల తరబడి విడివిడిగా జైలు శిక్ష అనుభవించిన అధ్యక్ష దంపతులు, అతనిపై అభిశంసనకు దారితీసి, చివరికి అతని పదవి నుండి తొలగుంపుకు గురయ్యారు. ఈ నెలలో యూన్‌ను నిర్బంధించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలను, యుద్ధ చట్ట డిక్రీకి సంబంధించిన ఇతర ఆరోపణలను ధిక్కరించినందుకు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.