గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనుంది. తెలంగాణకు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ ప్రముఖ (సీసీఎంబీ) శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై ఆయన పలు పరిశోధనలు చేసి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. మరోవైపు పశుసంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన కృషికిగానూ రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం వరించింది.
పద్మశ్రీ అవార్డు పొందిన మిగతా 43 మంది: అంకే గౌడ, ఆర్మిడా ఫెర్నాండెజ్, భగవాన్దాస్ రాక్వార్, భిక్ల్యా లడాక్యా ధిండా, బ్రిజ్ లాల్ భట్, బుధ్రి తాటి, చరణ్ హెంబ్రామ్, చిరంజీ లాల్ యాదవ్, ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యా, గఫ్రుద్దీన్ మేవాటి జోగి, హ్యాలీ వార్, ఇందర్జీత్ సింగ్ సిధు, కే పాజనివేల్, కైలాష్ చంద్ర పంత్, ఖేం రాజ్ సుంద్రియాల్, కొల్లక్కాయిల్ దేవకి అమ్మ జి, మహేంద్ర కుమార్ మిశ్రా, మిర్ హాజిభాయ్ కాసంబాయ్, మోహన్ నగర్.
నరేష్ చంద్ర దేవ్ వర్మ, నీలేష్ వినోద్చంద్ర మండలేవాలా, నూరుద్దీన్ అహ్మద్, ఓతువార్ తిరుత్తణి స్వామినాథన్, పద్మా గుర్మెట్, పొఖిలా లేఖ్తేపి, పున్నియమూర్తి నటేశన్, ఆర్ కృష్ణన్, రఘుపత్ సింగ్, రఘువీర్ తుకారాం ఖేడ్కర్, రాజస్థపతి కలియప్ప గౌండర్, రాంచంద్ర గోద్బోలే అండ్ సునీతా గోద్బోలే, ఎస్జీ సుశీలమ్మ, సంగ్యూసాంగ్ ఎస్ పొంగెనర్, షఫీ షౌక్, శ్రీరంగ్ దేవాబా లాడ్, శ్యామ్ సుందర్, సిమాంచల్ పాత్రో, సురేష్ హనగవాడి, తగా రామ్ భీల్, టేచి గుబిన్, తిరువారూరు భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నామ్ జత్రా సింగ్.

More Stories
దేశంలో తొలిసారిగా సంచార పశు పోషకుల గుర్తింపు
శబరిమలలో అపచారం.. సన్నిధానంలో సినిమా షూటింగ్
రాత్రికి రాత్రి ఇనుప వంతెన దొంగతనం