ఎట్టకేలకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ట్రంప్

ఎట్టకేలకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ట్రంప్
నోబెల్ శాంతి పురస్కారం అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కల ఎట్టకేలకు నెరవేరింది. గురువారం నాడు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడే అది ఆయనకు నోబెల్ కమిటీ ఇచ్చిన అవార్డు కాదు. వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో ఇచ్చింది. తాను అందుకున్న నోబెల్ శాంతి బహుమతిని ఆమె ట్రంప్‌నకు ఇచ్చేశారు. 
 
గురువారం ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయిన సమయంలో నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌కు ఆమె అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడోనే స్వయంగా వెల్లడించారు.  అయితే ఆ పురస్కారాన్ని  ట్రంప్ తన వద్దే ఉంచుకున్నారా? లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు. వైట్ హౌస్ సహితం దానిని ట్రంప్ స్వీకరించినట్లు ప్రకటించలేదు.
 
నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడానికి తాను అర్హుడిని అని డోనాల్డ్ ట్రంప్ గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మచాడో నోబెల్ పురస్కారం గెలుచుకున్నప్పుడు కూడా ఆమె నాయకత్వ సామర్థ్యంపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు.  అమెరికా అధ్యక్షుడికి తాను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేశానని ఆమె  తెలిపారు.  ఈ సందర్భంగా చారిత్రక ఘటనను ఆమె ఉదాహరించారు.
అమెరికా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఫ్రెంచ్ సైనికాధికారి మార్క్విస్ డి లాఫాయెట్ వెనెజువెలా విమోచకుడు సిమోన్ బొలివార్‌కు పతకం అందజేశారని గుర్తుచేశారు. రెండు శతాబ్దాల తర్వాత ఇప్పుడు బొలివార్ ప్రజలు వాషింగ్టన్ వారసుడిగా భావించే వ్యక్తికి ఈ పురస్కారాన్ని తిరిగి అందజేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
వెనెజువెలా ప్రజల సంక్షేమం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా తనకు వచ్చిన నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేశానని మచాడో తెలిపారు.
వెనెజువెలా ప్రజల స్వేచ్ఛ సాధన కోసం ట్రంప్ చేస్తున్న కృషిపై తమకు విశ్వాసం ఉందని ఆమె తెలిపారు.  వెనెజువెలా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఆయన అర్థం చేసుకుంటున్నారని ఆమె చెప్పారు. ఆ పురస్కారాన్ని అయితే నిబంధనలకు ప్రకారం ఒకరికి అందజేసిన పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయడం, ఇతరులతో పంచుకోవడం కుదరదని గతంలోనే నోబెల్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. విజేత పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొంది.

వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య అనంతరం అక్కడ పరిణామాలు మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనూ మచాడోకు ట్రంప్ మద్దతు ప్రకటించలేదు. వెనెజెవెలాను నడిపేంత శక్తి మచాడోకు లేదని వ్యాఖ్యానించి, తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్‌కు మద్దతునిచ్చారు. తాజాగా జరిగిన సమావేశంలోనూ డెల్సీతో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, మచాడోను వెనిజులా ప్రజల కోసం “ఒక విశిష్టమైన, ధైర్యవంతురాలైన స్వరం” అని అభివర్ణించారు. అయితే ఈ సమావేశం వల్ల ఆమెపై ట్రంప్ అభిప్రాయం మారిందని దీని అర్థం కాదని, ఇది కేవలం “ఒక వాస్తవిక అంచనా” అని కూడా ఆమె పేర్కొన్నారు. మచాడోకు “దేశంలోపల మద్దతు గానీ, గౌరవం గానీ లేదు” కాబట్టి ఆమె నాయకత్వం వహించడం కష్టమని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు.

మదురో తిరస్కరించిన 2024 ఎన్నికలలో ఆమె పార్టీనే గెలిచిందని విస్తృతంగా నమ్ముతున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ట్రంప్ కొత్త వెనిజులా ఎన్నికలకు మద్దతు ఇస్తారని లీవిట్ చెప్పారు. కానీ ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఆయన చెప్పలేదని తెలిపారు. ఇలా ఉండగా, ట్రంప్‌ను సందర్శించడం మచాడోకు భౌతికంగా కొంత ముప్పును తెచ్చిపెట్టింది. గత సంవత్సరం కారకాస్‌లో కొంతకాలం నిర్బంధించబడిన తర్వాత ఆమె తన దేశం విడిచి వెళ్ళినప్పటి నుండి ఆమె ఎక్కడ ఉందో పెద్దగా తెలియదు.
అయినప్పటికీ, ట్రంప్‌తో చర్చ తర్వాత, ఆమె గేట్ల దగ్గర తన కోసం వేచి ఉన్న డజన్ల కొద్దీ మద్దతుదారులను పలకరించింది. చాలా మందిని కౌగిలించుకోవడానికి ఆగి. “మనం అధ్యక్షుడు ట్రంప్‌పై ఆధారపడవచ్చు” అని ఆమె వారికి చెప్పింది, కొంతమంది “ధన్యవాదాలు, ట్రంప్” అని క్లుప్తంగా నినాదాలు చేయమని ప్రేరేపించింది. కానీ ఆమె వివరించలేదు.