“ఎన్నో సందర్భాల్లో అశక్తతతో చూస్తూ ఉండిపోయారు. ఎంతోమంది ఉరిశిక్షలు ఎదుర్కొన్నారు. మన గ్రామాలు కాలిపోయాయి. మన నాగరికత నాశనం అయింది. మన ఆలయాలు దోచుకున్నారు. అయినా మనం మౌనంగా నిలబడ్డాం” అని వ్యాఖ్యానించారు. ఈ చరిత్రే నేటి యువత ముందున్న అసలైన సవాల్ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి యువకుడి మనసులో ఆవేశం, తపన ఉండాలని చెప్పారు.
ప్రతీకారం అనే పదం సరైనది కాకపోవచ్చని అంగీకరిస్తూనే, చరిత్ర నుంచి వచ్చే ప్రతీకార భావన ఒక శక్తివంతమైన ప్రేరణగా మారాలని ఆయన పేర్కొన్నారు. “మన చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవాలి. అది హింస ద్వారా కాదు. మన దేశాన్ని తిరిగి నిలబెట్టడం ద్వారా. మన హక్కులు, మన ఆలోచనలు, మన నమ్మకాలు ఆధారంగా ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రతీకారం సాధించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
అయితే, భద్రతా ముప్పులను గుర్తించడంలో గతంలో చేసిన నిర్లక్ష్యం భారతదేశానికి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని అజిత్ ఢోబాల్ హెచ్చరించారు. శత్రువులను, ముప్పులను తేలికగా తీసుకోవడం వల్లే చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. “భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసినప్పుడు చరిత్ర మనకు గుణపాఠం చెప్పింది. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నామా? భవిష్యత్ తరాలు దాన్ని గుర్తుంచుకుంటాయా?” అని ఆయన ప్రశ్నించారు.

More Stories
సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇంకా ఉన్నాయి
అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ లో పాల్గొన్న ప్రధాని