కెప్టెన్ చమారి ఆటపట్టు (37 బంతుల్లో 52, 3 ఫోర్లు, 3 సిక్స్లు), హాసిని పెరీరా (33), ఇమేషా దులానీ (29) రాణించారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (2/24), అరుంధతి రెడ్డి (2/42)కి తలా రెండు వికెట్లు దక్కాయి. సిరీస్లో ఆఖరిదైన ఐదో మ్యాచ్ ఈనెల 30న ఇదే వేదికలో జరుగుతుంది.
ఈ మ్యాచ్లో స్మృతి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) పదివేల పరుగులు పూర్తిచేసిన నాలుగో క్రికెటర్గా (భారత్ నుంచి రెండో ప్లేయర్)గా రికార్డులకెక్కింది. మహిళా క్రికెట్లో ఈ ఘనతను అందుకున్నవారిలో మిథాలీ రాజ్ (314 ఇన్నింగ్స్ల్లో 10,868), న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ (343 ఇన్నింగ్స్ల్లో 10,652), ఇంగ్లండ్కు చెందిన చార్లెస్ ఎడ్వర్డ్స్ (316 ఇన్నింగ్స్ల్లో 10,273) మంధాన కంటే ముందున్నారు.
అయితే ఈ నలుగురిలో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నది మాత్రం స్మృతి (280 ఇన్నింగ్స్ల్లోనే)యే కావడం విశేషం. అలాగే ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు కొట్టిన ఆమె.. భారత్ తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్ (80)లు కొట్టిన హర్మన్ప్రీత్ రికార్డు (78)ను అధిగమించింది. ఈ ఏడాది భీకర ఫామ్లో ఉన్న స్మృతి మంధాన రికార్డుల మోత మోగిస్తోంది. వన్డే ప్రపంచకప్ ముందు శతకాలతో హోరెత్తించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒకే ఏడాది అత్యధిక పరుగులతో రికార్డు నెలకొల్పింది. మూడు ఫార్మాట్లలో దూకుడైన ఆటతో చెలరేగే మంధాన 10 వేల పరుగులు పూర్తి చేసుకుంది.

More Stories
మత మార్పిడి రాకెట్ల నిర్మూలనకు కృత్రిమ మేధస్సు
రష్యా సైన్యంలో చేరి 10 మంది భారతీయుల మృతి
2025లో ఎన్నో విజయాలు సాధించిన భారత్