* ఎల్వీఎం3-ఎం6 మిషన్ విజయవంతం
కమర్షియల్ మిషన్ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. బుధవారం ఉదయం అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్-2(బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తారు)ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఎల్వీఎం3-ఎం6 భారీ రాకెట్ ద్వారా ఆ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. 24 గంటల కౌంట్డౌన్ ముగియగానే ఇవాళ ఉదయం ఉదయం 8.55 నిమిషాలకు ఎల్వీఎం3 రాకెట్ దూసుకెళ్లింది.
విజయవంతంగా శాటిలైట్ పరీక్ష చేపట్టిన ఇస్రో బృందంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ విజన్ను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ఇస్రోను మెచ్చుకున్నారు. ఒక విజయం తర్వాత మరో విజయాన్ని నమోదు చేస్తూ అంతరిక్ష టెక్నాలజీ రంగంలో భారత సామర్థ్యాన్ని చాటుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఘటన మాత్రమే కాదు. ఇది అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని చాటి చెప్పిన చారిత్రాత్మక ఘట్టం.
ఈ మిషన్తో ఎల్వీఎం3 మరో చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య పేలోడ్ను మోసుకెళ్లిన రాకెట్గా ఇది రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, ఇప్పటివరకు 100 శాతం విజయ రేటు కొనసాగిస్తూ, ఎల్వీఎం3 ప్రపంచంలోని అత్యంత నమ్మకమైన హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ఇస్రో సాంకేతిక ప్రమాణాలపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య ఉపగ్రహంగా నిలిచింది.
ఈ బ్లూబర్డ్-6 ఉపగ్రహం భారతదేశం, అమెరికా మధ్య అంతర్జాతీయ సహకారాన్ని సూచిస్తుంది. ఇది ఉపగ్రహ ఆవిష్కరణ, కనెక్టివిటీ, విస్తరణ, భాగస్వామ్యాలలో ఒక ప్రధాన మైలురాయిని హైలైట్ చేస్తుంది.

More Stories
అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు అనూహ్య స్పందన
బంగ్లాదేశ్లో మూకదాడిపై భారత్లో ఆగ్రహ జ్వాల
17 ఏళ్ళ ప్రవాసం తర్వాత బంగ్లా వస్తున్న `భారత్ వ్యతిరేకి’ తారిక్!