ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, పరిశ్రమ, సాంకేతికత ఒకదానికొకటి బలోపేతం అవుతూ ముందుకు సాగుతున్న అరుదైన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా అవతరిస్తోంది. గత దశాబ్ద కాలంగా భారతదేశం పాటిస్తున్న స్థూల ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు స్పష్టమైన ఫలితాలను ఇస్తోంది. గత వృద్ధి చక్రాల మాదిరిగా కాకుండా, ప్రస్తుత వృద్ధి బాహ్య డిమాండ్ లేదా తాత్కాలిక విదేశీ మూలధన ప్రవాహాలపై ఎక్కువగా ఆధారపడటం లేదు.
దీనికి బదులుగా దేశీయ వినియోగం, విధానాల కొనసాగింపు, విస్తరిస్తున్న ఉత్పాదక సామర్థ్యం వంటి నిర్మాణాత్మక అంశాలపై ఇది బలంగా నిలబడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలంగా నిలబడేందుకు ఈ అంశాలతోనే భారతత్ ముందుకు వెళుతోంది. భారత్లో తయారీ రంగం కేవలం ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకునే దశ నుంచి విలువ సృష్టించే దశకు మారుతుంది.
ఈ మార్పుకు స్థూల ఆర్ధిక స్థిరత్వం కీలక ఆధారంగా నిలుస్తుంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు, ఆటో భాగాలు, పునరుత్పాదక ఇంధన హార్డ్వేర్, డేటా సెంటర్లు, ప్రారంభ దశలో ఉన్న సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో వేగంగా వృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ భారతదేశాన్ని గ్లోబల్ విలువ గొలుసుల్లో మరింత స్థిరంగా నిలబెడుతున్నాయి. భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే తయారీ రంగంలో దశలవారీ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు తయారీ రంగం జిడిపిలో 15 నుంచి 17 శాతం మాత్రమే వాటా కలిగి ఉంది. చైనా, దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాల అభివృద్ధి మార్గాలను అనుసరించాలంటే ఈ వాటా కనీసం 25 శాతం వైపు పెరగాలి. ఇక ప్రాథమిక సంకేతాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆపిల్ తన ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు ఐదవ వంతును భారత్లోనే తయారు చేస్తోంది. 2027 నాటికి ఈ వాటాను మూడింట ఒక వంతుకు పైగా పెంచాలన్నది కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

More Stories
రూ. 4వేల కోట్ల బకాయిలతో కర్ణాటక ఆర్టీసీ దివాలా!
సంక్షోభంలో భారత బియ్యం ఎగుమతులు
ఈడీ దర్యాప్తునకు శబరిమలలో బంగారం చోరీ కేసు