కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు. మంచు దుప్పటి కప్పేయడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో సుమారు 40 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా 22కు పైగా రైళ్లు ఆలస్యమయ్యాయి.
గురువారం నుంచి కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం(పీయూసీ) లేని వాహనాలకు డిల్లీ పెట్రోల్ స్టేషన్లలో ఇంధనం అందించరు. అంతేకాకుండా డిల్లీ బయట రిజిస్టరైన బీఎస్-4 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాలకు రాజధానిలోకి ప్రవేశం ఉండదు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు డిల్లీ సరిహద్దుల వద్ద పోలీస్, రవాణా శాఖ బృందాలను మెహరించారు.
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలు, పెట్రోల్ బంక్ల వద్ద వాయిస్ అలర్ట్, పోలీసులు సాయంతో అమలు చేస్తున్నారు. అందుకోసం సరిహద్దులతో సహా చెక్పాయింట్ల వద్ద 580 మంది పోలీసులను మోహరించారు. బీఎస్-4 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే దిల్ లోకి అనుమతిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. బీఎస్-4, బీఎస్-3 లేదా అంతకంటే పాత ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాలకు ప్రవేశం నిషేధమని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
ఈ నిబంధన వల్ల సుమారు 12 లక్షల వాహనాలు ప్రభావితమవుతాయని అంచనా. ఢిల్లీ రోజూ ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత అవసరాల కోసం వచ్చే వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజలతో పాటు క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రతిరోజూ లక్షలాది క్యాబ్లు డిల్లీ-ఎన్సీఆర్లో తిరుగుతుంటాయి. వాటిలో చాలా వాహనాలు బీఎస్-4 ప్రమాణాలు కలిగివుండవు. వేలాది డ్రైవర్లు ఈ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారు
ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ పడిపోయింది. గురువారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 370 పాయింట్లు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. అటు ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో కూడా దట్టమైన పొగమంచు ఉంది. ఇప్పటికే డిల్లీలో జీఆర్ఏపీ-4ను అమలు చేసింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన జీఆర్ఏపీ-3, జీఆర్ఏపీ-4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయినవారికి నష్టపరిహారంగా రూ.10 వేలు చెల్లిస్తామని కూడా తెలిపింది. దిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు గరిష్ఠంగా 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని పేర్కొంది.

More Stories
ఛత్తీస్గఢ్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
బోండీ బీచ్ లో కాల్పుల దర్యాప్తులో భారత బృందం
నెహ్రూ ప్రైవేటు లేఖలు తప్పి పోలేదు… సోనియా దగ్గరున్నాయ్