పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్న ‘గోట్ టూర్’ ఈవెంట్లో తలెత్తిన తీవ్ర గందరగోళం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి మమతాబెనర్జికి తన రాజీనామా లేఖను పంపారు. ‘దీదీ.. కోల్కతా స్టేడియంలో ఉద్రిక్తతలపై దర్యాప్తునకు మీరు ఇప్పటికే ఒక విచారణ కమిటీని నియమించారు. ఆ విచారణ నిష్పాక్షికంగా జరగడం కోసం నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. నా రాజీనామాను ఆమోదించాలని అభ్యర్థిస్తున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ రాజీనామాకు సీఎం మమత బెనర్జీ వెంటనే ఆమోదముద్ర వేశారు.
అరూప్ బిస్వాస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తులలో ఒకరు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ లో శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన రాజీకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. మెస్సీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దానితో క్రీడా మంత్రి రాజీనామా తప్పలేదు.

More Stories
ప్రధాని మోదీని `గొప్ప స్నేహితుడు’గా పేర్కొన్న అమెరికా
మావోయిస్టు హింసాత్మక ఘటనలు 89 శాతం తగ్గుముఖం
కాలుష్యంపై ఢిల్లీ మంత్రి ప్రజలకు క్షమాపణలు