భారత్‌కు 40వేల ఇజ్రాయెల్‌ లైట్ మెషీన్ గన్స్‌

భారత్‌కు 40వేల ఇజ్రాయెల్‌ లైట్ మెషీన్ గన్స్‌

వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు 40 వేల లైట్ మెషిన్ గన్స్‌‌‍ను ఇజ్రాయెల్‌కు సంస్థ సరఫరా చేయనుంది. దాదాపు 1.70 లక్షల కార్బైన్‌ల సరఫరా ఒప్పందం చివరి దశకు చేరుకుంది. ఇందులో 40 శాతం ఆయుధాలను అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ ద్వారా సరఫరా కానున్నాయి. అంతేకాకుండా అత్యంత ఖచ్చితత్వం కోసం ఉద్దేశించిన ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ అర్బెల్ టెక్నాలజీని కూడా భారత్‌లో అనుసంధానం చేసేందుకు ఆ సంస్థ చర్చలు జరుపుతోంది. 

ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌ ‘అర్బెల్‌ టెక్నాలజీ’ని భారత్‌కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతోంది.  మొదటి విడతలో 40వేల లైట్‌ మెషిన్‌ గన్స్‌ అందనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వాటిని సరఫరా చేయనున్నట్లు రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది.  ఇప్పటికే వాటి పరీక్షలు పూర్తయ్యాయని ఉత్పత్తి కోసం లైసెన్స్‌ పొందినట్లు వెల్లడించింది. వాటితోపాటు దాదాపు లక్షా 70వేల క్లోజ్‌ క్వార్టర్స్‌ బ్యాటిల్‌ కార్బైన్ల సరఫరాకు సంబంధించిన ఒప్పందం తుది దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సిఈఓ అయిన షుకి స్క్వార్ట్జ్ మాట్లాడుతూ, తమ సంస్థ ప్రస్తుతం భారత హోం మంత్రిత్వ శాఖలోని వివిధ ఏజెన్సీలతో కలిసి పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్ గన్‌లు వంటి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి సహకరిస్తోందని చెప్పారు.  “మేము ఇప్పుడు మూడు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొన్నాము. మొదటిది 40,000 ఎల్ఎంజిల కోసం ఒప్పందం. దీనిపై గత సంవత్సరం సంతకం జరిగింది. మేము అన్ని పరీక్షలు, ట్రయల్స్, ప్రభుత్వ తనిఖీలను పూర్తి చేసాము. ఉత్పత్తికి లైసెన్స్ పొందాము. సంవత్సరం ప్రారంభంలో మొదటి బ్యాచ్‌ను సరఫరా చేయాలని మేము భావిస్తున్నాము” అని ఆయన చెప్పారు.

“వీటి సరఫరా ఐదు సంవత్సరాలు. మేము దీన్ని వేగంగా చేయగలము, కానీ మొదటి సరఫరా సంవత్సరం ప్రారంభంలో ఉంటుంది” అని తెలిపారు. రెండవ కార్యక్రమంలో క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ (సిక్యూబి) కార్బైన్‌ల టెండర్ ఉంటుందని, ఇక్కడ సంస్థ రెండవ బిడ్డర్‌గా ఉందని మిస్టర్ స్క్వార్ట్జ్ పేర్కొన్నారు. భారత్ ఫోర్జ్ ప్రాథమిక బిడ్డర్. “మేము ఒప్పందంలో 40% సరఫరా చేయాలని భావిస్తున్నాము. మేము ఒప్పందంపై ముందస్తు సంతకం దశలో ఉన్నాము ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది ఖరారు అవుతుందని నేను నమ్ముతున్నాను” అని ఆయన పేర్కొన్నారు. 

సిక్యూబి కార్బైన్‌ల సరఫరాలో 60% భారత్ ఫోర్జ్ నుండి తీసుకోగా,  మిగిలిన 40% (1,70,000 యూనిట్లు) అదానీ గ్రూప్అనుబంధ సంస్థ అయిన పీఎల్ఆర్ సిస్టమ్స్ ద్వారా పంపిణీ చేస్తారు.  యుద్ధభూమిలో సైనికులు అత్యంత కచ్చితత్వంతో, చురుగ్గా వ్యవహరించేందుకు అర్బెల్‌ సాంకేతికత ఎంతో ఉపకరిస్తుందని వెల్లడించారు.  ఒప్పందం పూర్తికాగానే భారత్‌లోనూ వాటి తయారీ చేపడతామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. అర్బెల్ టెక్నాలజీలో అధునాతన సెన్సర్లు ఉంటాయి. రియల్ టైమ్ బాలిస్టిక్ కంప్యూటేషన్ ద్వారా సైనికులు లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించగలరు. 

ఇందులో ఉపయోగించే మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ అల్గారిథం ఆయుధం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించగలదా, లేదా అని మిల్లీ సెకన్లలో అంచనా వేస్తుంది. మొదటి షాట్ తర్వాత షూటర్ ట్రిగ్గర్‌పై వేలు అలాగే ఉంచితే షూటర్ ప్రవర్తనను విశ్లేషించి తదుపరి రౌండ్లను కూడా విడుదల చేస్తుంది. అర్బెల్ కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్ను ఇజ్రాయెల్కు చెందిన ఐడబ్ల్యూఐ సంస్థ నుంచి భారత్ పొందితే మనకు చిన్న ఆయుధాల ఫైర్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.