మరోవైపు భారత్-రష్యా సంబంధాలు విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. హైదరాబాద్హౌజ్లో ప్రధాని నరేంద్రమోదీ-పుతిన్ భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సైతం సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోదీకి పుతిన్ వివరించారు. ఈ సందర్భంగానే శాంతి మాత్రమే సమస్యకు పరిష్కారమని పుతిన్కు మోదీ స్పష్టంచేశారు.
అయితే తాము ఉక్రెయిన్తో సంధి ఒప్పందం చేసుకోవాలని యత్నిస్తున్నామని, శాంతి పరిష్కార మార్గాలన్నిటినీ అన్వేషిస్తున్నామని పుతిన్ చెప్పారు. బహుళ ధ్రువ ప్రపంచం కోసం పనిచేస్తామని వివరించారు. సాంకేతికత, కృత్రిమమేధ, అంతరిక్ష రంగాల్లో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు.
కాగా, దీనికి ముందు పుతిన్కు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. తన పర్యటనలో భాగంగా రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుతిన్ నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, గొప్ప ఫిలాసఫర్గా, మానవతావాదిగా మహాత్మాగాంధీ నిలిచారని, ప్రపంచ శాంతికి ఎనలేని కృషి చేశారని పుతిన్ అక్కడి విజిటర్స్ బుక్లో రాశారు. స్వేచ్ఛ, మంచితనం, మానవత్వంపై మహాత్మాగాంధీ ఆలోచన నేటికీ నిత్య నూతనమని గుర్తుచేసుకున్నారు.

More Stories
వికసిత్ భారత్ కు అవసరమైన ప్రతి సహకారం అందిస్తాం
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం
తిరుప్పరంకుండ్రం కొండపై బిజెపి అధ్యక్షుడు నాగేంద్రన్ అరెస్ట్