పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ మహిళా గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్ను తయారు చేస్తున్నది. అయితే, కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో మహిళల్ని ఆకర్షించినట్లు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం గమనార్హం.
ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోందని జైష్ చీఫ్ మసూద్ అజార్ అందులో పేర్కొన్నారు. ఇప్పుడు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. “జైషే మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోంది. చాలా తక్కువ సమయంలోనే 5,000 మందికిపైగా మహిళలు చేరారు. ఇదంతా అల్లా దయ వల్లే జరిగింది. చాలా మంది సోదరీమణులు నియామకం పొందిన వెంటనే తమ మానస్థిక స్థితిమారిపోయినట్లు చెబుతున్నారు. జీవిత లక్ష్యాన్ని గ్రహించినట్లు చెప్పారు” అని వెల్లడించారు.
ఇప్పుడు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ప్రతి జిల్లాకు ఒక ముంటాజియా (మేనేజర్) ఉంటారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా, పలు నివేదికల ప్రకారం జమాతుల్-ముమినాత్ కోసం నియామక డ్రైవ్ ఈ ఏడాది అక్టోబర్ 8న జైషే ప్రధాన కార్యాలయం మర్కజ్ ఉస్మాన్-ఓ-అలీలో ప్రారంభమైంది.
ఈ డ్రైవ్లో భాగంగా పాక్లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి నుంచి మహిళలను ఉగ్రవాద సంస్థలోకి చేర్చుకున్నారు. ఈ సంస్థ రూ.500 ఫీజుతో 40 నిమిషాలు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ మహిళల్ని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్ఐఎస్, హమాస్, ఎల్టీటీఈ తరహాలో ఫిదాయిన్ (ఆత్మాహుతి) దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
తుహ్ఫత్-ఉల్-ముమినాత్ అంటే మహిళా విశ్వాసులకు బహుమతి అని అర్ధం. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సును ఎన్క్రిప్ట్ చేసిన టెలిగ్రామ్ గ్రూపులు, జెఇఎం మీడియా విభాగాలకు అనుసంధానించిన సోషల్ మీడియా హ్యాండిల్స్, అనుబంధ మదర్సా నెట్వర్క్ల ద్వారా ఉన్నాయి. “జిహాద్, త్యాగం, వినయాన్ని అర్థం చేసుకోవడం” వైపు “ఆధ్యాత్మిక ప్రయాణం”గా రూపొందించిన దానిలో మహిళలు పాల్గొనడానికి కోర్సు నమోదు రుసుము 500 పాకిస్థానీ రూపాయలు. భారత్ కరెన్సీలో రూ 150 మాత్రమే.
నవంబర్ 10, 2025న జరిగిన ఢిల్లీ ఎర్రకోట పేలుడులో అదే మహిళా బ్రిగేడ్, జమాత్-ఉల్-ముమినాటిస్ ప్రమేయం ఉందని ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఈ విభాగంలో భాగమైన డాక్టర్ షాహీనా షాహిద్ భారతదేశంలో దాని కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ గ్రూప్ స్థావరాలను ధ్వంసం చేసిన వెంటనే, ‘డిజిటల్ హవాలా’ను సులభతరం చేయడానికి, దాని కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి నిధులను సేకరించడానికి జెఇఎం ఈజీపైసా, సదాపే వంటి డిజిటల్ వాలెట్ల ద్వారా విరాళాలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఈ ఆన్లైన్ కోర్సు ప్రారంభించారు. జెఇఎం 2,000 కంటే ఎక్కువ యాక్టివ్ డిజిటల్ వాలెట్ ఖాతాలను నిర్వహిస్తోంది, ఏటా 2.8–3.2 మిలియన్ల అమెరికా డాలర్లను దీని ద్వారా తరలిస్తుంది.

More Stories
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
అమెరికాది ఒప్పు.. భారత్ది తప్పా?