దీంతో ఆగస్టు 26న మైసూరులోని నజర్బాద్ పోలీస్ స్టేషన్లో మరో ఇద్దరితో సహా ఆ మఠాధిపతిపై పోక్సో కేసు నమోదైంది. మరునాడు చిత్రదుర్గ పోలీస్ స్టేషన్కు ఆ కేసును బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న శివమూర్తి మురుగ శరణరును పోలీసులు అరెస్ట్ చేశారు. 14 నెలలు జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.మరోవైపు 2023 నవంబర్లో శివమూర్తి మురుగ శరణరు బెయిల్పై విడుదలయ్యాడు.
అయితే రెండో కేసుకు సంబంధించి నవంబర్ 20న పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. బెయిల్ ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలిపివేసింది. లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. కాగా, శివమూర్తి మురుగ శరణరు తమపై మూడేళ్లుగా పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత బాలికలు ఆరోపించారు. అయితే దీనికి విరుద్ధంగా మెడికల్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మఠాధిపతిపై నమోదైన రెండు పోక్సో కేసుల్లో ఆయనను నిర్దోషిగా సెషన్స్ కోర్టు పేర్కొంది. బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

More Stories
అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్ అవాకులు
కొత్త కార్మిక కోడ్లు ఉద్యోగులు, యజమానులిద్దరికీ ప్రయోజనం
రాజ్యాంగ విధులను నిర్వర్తించండి