చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు షాంఘై ఎయిర్పోర్టులో భారత మహిళ పెమా వాంగ్ థాంగ్డోక్ ను వేధింపులకు గురిచేశారు. లండన్ నుంచి జపాన్ కు వస్తున్న ఆ అరుణాచల్ప్రదేశ్ మహిళను చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
అరుణాచల్ప్రదేశ్ చైనాలో భాగమని, కాబట్టి ఆమె పాస్పోర్టు చెల్లదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా చైనా పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాదు ఎయిర్పోర్టులో ఆమెను ఎక్కడికీ స్వేచ్ఛగా కదలనీయలేదు. ఆఖరికి ఆహారం కూడా ఇవ్వలేదు. ఇలా ఏకంగా 18 గంటలపాటు ఆమెను అడ్డుకున్నారు. చివరికి బాధితురాలి స్నేహితురాలు చైనాలోని భారత రాయబార కార్యాలయానికి విషయం చేరవేయడంతో వారు జోక్యం చేసుకున్నారు.
ఇండియన్ ఎంబసీ జోక్యంతో బాధితురాలిని విడిచిపెట్టారు. ఈ సంఘటనపై భారతదేశం చైనాకు తీవ్ర నిరసన తెలిపింది. సంఘటన జరిగిన రోజునే బీజింగ్, ఢిల్లీలో చైనా వైపు నుండి “బలమైన ఒప్పందం” కుదిరిందని వర్గాలు తెలిపాయి. “షాంఘైలోని మా కాన్సులేట్ కూడా స్థానికంగా ఈ విషయాన్ని చేపట్టి చిక్కుకున్న ప్రయాణీకుడికి పూర్తి సహాయం అందించింది” అని ఆ వర్గాలు తెలిపాయి.
ఆ ప్రయాణీకురాలిని “హాస్యాస్పద కారణాల వల్ల” అదుపులోకి తీసుకున్నారని భారత దేశం చైనాకు అభ్యంతరం వ్యక్తం చేసిన్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ నిస్సందేహంగా భారత భూభాగం, మరియు దాని నివాసితులు భారత పాస్పోర్ట్లను కలిగి ఉండటానికి, ప్రయాణించడానికి పూర్తిగా అర్హులు అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
30 ఏళ్ల వయసున్న ప్రేమా థాంగ్డోక్, 14 సంవత్సరాలుగా యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్నారు. ఆమె కుటుంబం ఇప్పటికీ అక్కడే నివసిస్తుంది. ఆమె ఆర్థిక సలహాదారుగా పనిచేస్తుంది. ఈ ఘటనపై సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్గా మారింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు, అక్కడి ఈస్టర్న్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తనను వేధించారని, దాదాపు 18 గంటలపాటు తాను ఆ వేదనను భరించానని, ఆఖరికి ఇండియన్ ఎంబసీ జోక్యంతో వారు తనను విడిచి పెట్టారని పేర్కొన్నారు.
అరుణాచల్ప్రదేశ్ చైనాలో భాగమని, ఇండియన్ పాస్పోర్టు చెల్లదని ఎగతాళి చేశారని పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీకి, ఇతర అధికారులకు లేఖ రాసినట్లు ఆమె చెప్పారు. ఇదంతా భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను అవమానించడమేనని అందులో ఆమె పేర్కొన్నారు.

More Stories
ఆయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణం.. నేడే ధ్వజారోహణం
10 వేల ఏళ్ల తర్వాత పేలిన ఇథియోపియాలోనిఅగ్నిపర్వతం
లొంగుబాటుకు సమయం కోరిన మావోయిస్టులు