ఈ ఘటన తర్వాత పలు రాష్ట్రాల్లో దర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలోనే యూపీ ప్రభుత్వం ఈ కొత్త ప్రోటోకాల్ను అమలు చేసింది. ఇటీవలి నెలల్లో మదర్సాలు, ప్రైవేట్ మతపరమైన సంస్థల్లోకి ఇతర రాష్ట్రాల యువత పెద్దఎత్తున చేరుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. అందువల్ల, ఈ సంస్థలపై మరింత పరిశీలన అవసరం ఏర్పడింది. అదే కారణంగా మదర్సాల వివరాల ధృవీకరణ బాధ్యతను ఏటీఎస్ కు అప్పగించారు.
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో భాగంగా లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీలో పనిచేసే లెక్చరర్ పేరు బయటకు రావడంతో ఆ విశ్వవిద్యాలయం కూడా విచారణలో భాగమైంది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీని నిఘా సంస్థలు ఈ వివరాలు సమర్పించమని ఆదేశించాయి: జమ్మూ కశ్మీర్కి చెందిన అధ్యాపకుల గుర్తింపు పత్రాలు, యూనివర్శిటీలో చదువుతున్న జమ్మూ కశ్మీర్ విద్యార్థుల రికార్డులు, విదేశీ విద్యార్థుల సంఖ్య, వారి కోర్సులు, విద్యార్థుల పూర్తి వివరాలు అందించాలి.
యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, రాష్ట్రంలో అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడం, ఉగ్రవాద నెట్వర్క్లను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

More Stories
తొలి 9 నెలల్లో 99 శాతం రోజులలో తీవ్రమైన వాతావరణం
2035నాటికి అందరికీ ఈ- పాస్ పోర్ట్లు
ఢిల్లీ పేలుడుకు నేపాల్ లో మొబైళ్లు, కాన్పూర్ లో సిమ్ లు