ఈ సందర్భంగా ఇన్సాస్, స్టెన్గన్, 303 రైఫిల్స్తో పాటు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ మాట్లాడుతూ డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్, సీఏఎఫ్ దళాలను చుట్టుపక్కల ప్రాంతాలకు పంపినట్లు ఐజీ పేర్కొన్నారు.
ఎన్కౌంటర్లో గాయపడ్డ నలుగురు నక్సల్స్ను సంఘటనా స్థలంలోనే అరెస్టు చేసినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు. సంఘటనా స్థలంలోనే వారికి చికిత్స అందించి, అంబులెన్స్ ద్వారా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను పంపించామని, కూంబింగ్ ముగిసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా జాడను పోలీసులు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తాజా గా వేల మంది బలగాలను రంగంలోకి దింపారు. పామేడు, అబూజ్మడ్, నేషనల్ పార్కు, కర్రెగుట్టల్లో గాలింపు ముమ్మరం చేశారు. హిడ్మా లొంగి పోవాలని, హిడ్మా ఇంటికెళ్లి ఛత్తీ్సగఢ్ హోంమంత్రి విజయశర్మ ఇటీవలే కోరారు. అడవుల్లో ఇంకా సాయుధ పోరాటం చేస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, బెహరా, పశులూరి విశ్వనాథం, కాకా హనుమంతు, మల్లా రాజిరెడ్డి, అనల్ధా, రణదేవ్, గోసం గాలింపు ముమ్మరం చేశారు.

More Stories
ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు!
`మతమార్పిడి’ చట్టాలపై అత్యవసర విచారణకు సుప్రీం నో
ఢిల్లీలో జరిగిన ప్రధాన బాంబు దాడులు ఇవే !!