పెద్దసంఖ్యలో తీర్థయాత్ర స్థలాలున్న ఉత్తరాఖండ్ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారగలదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన, యోగ కేంద్రాలను ప్రపంచ నెట్వర్క్తో అనుసంధానం చేయొచ్చని చెప్పారు. దెహ్రాదూన్లో జరిగిన ఉత్తరాఖండ్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, 8వేల 2వందల 60కోట్ల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉత్తరాఖండ్ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. 2లక్షల కోట్ల వ్యయంతో కూడిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 25ఏళ్లక్రితం 4వేల కోట్లు ఉన్న ఉత్తరాఖండ్ బడ్జెట్ ఇప్పుడు లక్ష కోట్లు దాటినట్లు ప్రధాని మోదీ చెప్పారు. “ఉత్తరాఖండ్కు అసలైన గుర్తింపు దాని అధ్యాత్మికశక్తి. ఉత్తరాఖండ్ అనుకుంటే కొన్నేళ్లలోనే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారగలదు. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన, యోగ కేంద్రాలను ప్రపంచ నెట్వర్క్తో అనుసంధానం చేయొచ్చు” అని చెప్పారు.
“దేశ విదేశాల నుంచి ప్రజలు ఆరోగ్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఔషధ మూలికలు, ఆయుర్వేద ఔషధాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత 25ఏళ్లలో ఆరోమెటిక్ మొక్కలు, ఆయుర్వేద మూలికలు, యోగం, ఆరోగ్య పర్యాటకంలో ఉత్తరాఖండ్ అద్భుతమైన ప్రగతి సాధించింది” అని ప్రధాని కొనియాడారు.
ఈ వేడుకలో భాగంగా, 2000 సంవత్సరంలో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి దాని ప్రయాణం, విజయాలను ప్రతిబింబించే స్మారక తపాలా బిళ్ళను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ ప్రజల స్థితిస్థాపకత, స్ఫూర్తిని ప్రశంసించారు.

More Stories
ఆర్ఎస్ఎస్ నమోదు కాకపోయినా చట్టబద్ధ సంస్థే!
హిందువుగా ఉండటం అంటే భారత్ పట్ల బాధ్యత వహించడమే
బిహార్కు అవినీతి, తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు