ఈ సంక్షోభం కనిపించే దానికంటే చాలా లోతుగా ఉంది. చదువు, ఉద్యోగం లేదా శిక్షణ వంటివి ఏవీ లేకుండా ఖాళీగా ఉన్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. వీరికి తోడు, మహిళల్లో ఉద్యోగ భాగస్వామ్యం ఈ ప్రాంతంలోనే అత్యంత తక్కువగా ఉండటం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఇటీవల సంభవించిన వరదలు (2022, 2025), అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల సంక్షోభం వంటివి చిన్న వ్యాపారాలను, స్థానిక ఉద్యోగ మార్కెట్లను దెబ్బతీశాయి.
దీంతో లక్షలాది మంది పేదరికంలోకి జారుకున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నిరాశకు గురైన యువత పేదరికం, నేరాలు, తీవ్రవాద సంస్థల వైపు ఆకర్షితులవుతున్నారు. బలూచిస్థాన్లోని బొగ్గు గనుల్లో కార్మికుల మరణాలు, వీధుల్లో గన్పాయింట్తో దోపిడీలు వంటి ఘటనలు ఈ దుస్థితికి అద్దం పడుతున్నాయి.
కొందరు యువకులు మదర్సాలు, సోషల్ మీడియా ద్వారా తీవ్రవాదం వైపు మళ్లుతున్నారని, ఇది దేశ భద్రతకు పెను ముప్పుగా మారుతోందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో అక్కడి విద్యావ్యవస్థ విఫలమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

More Stories
భారత్ భయంతో జకీర్ నాయక్ పర్యటనపై బంగ్లాదేశ్ వెనకడుగు!
మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు
భారతీయ హిందువులను వెనక్కి పంపిన పాక్