కాగా, ‘శీష్ మహల్ 2.0’పై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియా కవరేజీని అడ్డుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు స్వాతి మలివాల్ ఆదివారం ఆరోపించారు. ‘షాకింగ్! ఈ ఉదయం అనేక ప్రాంతాలలో వార్తాపత్రికల పంపిణీని నిరోధించడానికి పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్ ‘శీష్ మహల్ 2.0’ గురించిన వార్తలు పంజాబ్ అంతటా దావానలంలా వ్యాపిస్తుండటంతో ఇదంతా జరుగుతోంది’ అని ఎక్స్ పోస్ట్లో విమర్శించారు.
మరోవైపు తన ఆరోపణలను కవర్ చేసినా లేదా తన పేరును ప్రస్తావించినట్లయితే ప్రభుత్వ ప్రకటనలు ఉపసంహరిస్తామని మీడియా సంస్థలను పంజాబ్ ప్రభుత్వం బెదిరిస్తున్నదని స్వాతి మలివాల్ ఆరోపించారు. ‘నియంతృత్వం పరాకాష్టకు చేరింది’ అని ఎక్స్ పోస్ట్లో ఆమె మండిపడ్డారు. వార్తాపత్రికల పంపిణీని పోలీసులు అడ్డుకుంటున్న వీడియో క్లిప్ను ఆమె పోస్ట్ చేశారు.
అయితే, వార్తాపత్రికల పంపిణీని ఆపేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని, వాహనాలు, డ్రైవర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విడుదల చేశరమని పోలీసులు చెబుతున్నారు. ఈ వాహనాలను మాదకద్రవ్యాలు లేదా ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి ఉపయోగించవచ్చనే సమాచారం ఆధారంగా తనిఖీ చేయడానికి ఈ కసరత్తు నిర్వహించినట్లు స్పెషల్ డీజీపీ అర్పిత్ శుక్లా తెలిపారు. “వార్తాపత్రికల ప్రసరణను ఆపడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వాహనాలు, డ్రైవర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విడుదల చేశారు. మిగిలినవి ప్రక్రియలో ఉంటాయి” అని చెప్పారు.
జలంధర్ కాంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ పంజాబ్లో పత్రికా స్వేచ్ఛపై ఇది ప్రత్యక్ష దాడి అంటూ ఎక్స్ లో రాశారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అధికారిక హౌస్ నంబర్ 50 లో బస చేశారనే వార్తలు ప్రజలకు చేరకుండా నిరోధించడానికి భగవంత్ మాన్ ప్రభుత్వం దాడులు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా వార్తాపత్రికల పంపిణీని నిరోధించిందని ఆయన పేర్కొన్నారు.

More Stories
నిధుల కోసం గాంజా సాగు ప్రోత్సహిస్తున్న మావోయిస్టులు
హర్మన్ప్రీత్ సేనకు బీసీసీఐ రూ. 51 కోట్ల నజరానా
భారత మహిళల జట్టుకు తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం