రఫేల్‌ యుద్ధవిమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము

రఫేల్‌ యుద్ధవిమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము

భారత దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శక్తిమంతమైన రఫేల్‌ యుద్ధవిమానంలో విహరించి చరిత్ర సృష్టించారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె ప్రయాణించారు. ఎయిర్​ఫోర్స్​ అధిపతి మార్షల్​ ఏపీ సింగ్​ ప్రత్యక్షంగా వీక్షించారు. రఫేల్​ జెట్​లోకి ఎక్కేముందు ఆమె జీ సూట్​ ధరించారు. చేతిలో హెల్మెట్​ పట్టుకుని, సన్​గ్లాసెస్​ ధరించిన ముర్ము, పైలట్​తో ఫొటో దిగారు. 

అయితే గగనవిహారం అనంతరం కొద్దిసేపటి తర్వాత ముర్ము యథాస్థానానికి క్షేమంగా చేరుకున్నారు. రఫేల్‌లో గగనవిహారం మరపురాని అనుభవమని ముర్ము తెలిపారు. శక్తివంతమైన రఫేల్‌లో ప్రయాణించడం, దేశ రక్షణ సామర్థ్యాలపై నూతన గర్వాన్ని నింపిందని  ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళం బృందాన్ని అభినందిస్తున్నాట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.

మరో ప్రత్యేకత ఏమిటంటే, వారణాసిలో జన్మించిన స్క్వాడ్రన్ లీడర్ శివంగి సింగ్ అంబాలా వైమానిక దళ స్థావరంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కలిసి పోజులిచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను పట్టుబడ్డానని పాకిస్తాన్ సోషల్ మీడియా వాదనలను ఆ విధంగా ఆమె తోసిపుచ్చారు.

రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్ సింగ్, రాష్ట్రపతికి విమానాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. సింగ్ విమానాలతో సహా ఆరు భారతీయ జెట్‌లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనలు అవాస్తవమని భారత అధికారులు నిర్ధారించారు, అయితే పాకిస్తాన్ వాస్తవానికి దాని స్వంత విమానాలను కోల్పోయింది. సింగ్ “దుఃఖంలో మునిగిపోయిన కుటుంబం” గురించి సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వీడియోలు సంబంధం లేనివి, బదులుగా సార్జెంట్ సురేంద్ర కుమార్ కుటుంబాన్ని చూపిస్తున్నాయి.

ఈ ఏడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్​పై భారత్​ జరిపిన దాడుల్లో(ఆపరేషన్​ సిందూర్​) రఫేల్​ జెట్లు కీలక పాత్ర పోషించాయి. ఈ జెట్​లు అత్యంత కచ్చితత్వంతో పాక్​లోని ఉగ్రస్థావరాలను మట్టికరిపించాయి. అయితే ఆపరేషన్‌ సిందూర్‌కు 6 నెలల తర్వాత రాష్ట్రపతి యుద్ధవిమానంలో గగనవిహారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు రాష్ట్రపతి ఎయిర్‌బేస్‌లో భారత వాయుసేన నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ద్రౌపదీ ముర్ము యుద్ధ విమానంలో విహరించడం ఇది రెండోసారి. 2023లో ఆమె రష్యా తయారీ సుఖోయ్‌-30 ఫైటర్‌ జెట్‌లో గగనవిహారం చేశారు. 2006లో ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రాష్ట్రపతిగా తొలిసారి సుఖోయ్‌-30 యుద్ధవిమానంలో సూపర్‌సోనిక్‌ వేగంతో గగనవిహారం చేశారు. అనంతరం 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ కూడా అదే ఫైటర్‌లో పయనించారు.