మలేసియాలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు వర్చువల్గా హాజరు కానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతకుముందు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సైతం ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు ఎక్స్లో వెల్లడించారు. ముందస్తు కార్యక్రమాల కారణంగా మోదీ వర్చువల్గా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తానని చెప్పినట్లు ఇబ్రహీం తెలిపారు.
ఈ నెల 26 నుంచి 28 వరకూ ఆసియాన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో మలేషియాతోపాటూ కంబోడియాలో కూడా ప్రధాని పర్యటించాలని తొలుత భావించారు. అయితే, తాజాగా ఆయన ఈ సదస్సుకు వెళ్లకపోవడంత కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఈ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ గైర్హాజరు నేపథ్యంలో ట్రంప్ – మోదీ భేటీ ఈసారి కూడా లేనట్లే.
ఈ ఆసియాన్లో మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమ్మిట్లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.

More Stories
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు తొలగిస్తేనే చర్చలు
చర్చలు అంటూనే 2000 మంది పారాట్రూపర్లను మోహరించిన ట్రంప్
పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించిన మోదీ, ట్రంప్