మలేసియాలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు వర్చువల్గా హాజరు కానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతకుముందు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సైతం ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు ఎక్స్లో వెల్లడించారు. ముందస్తు కార్యక్రమాల కారణంగా మోదీ వర్చువల్గా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తానని చెప్పినట్లు ఇబ్రహీం తెలిపారు.
ఈ నెల 26 నుంచి 28 వరకూ ఆసియాన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో మలేషియాతోపాటూ కంబోడియాలో కూడా ప్రధాని పర్యటించాలని తొలుత భావించారు. అయితే, తాజాగా ఆయన ఈ సదస్సుకు వెళ్లకపోవడంత కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఈ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ గైర్హాజరు నేపథ్యంలో ట్రంప్ – మోదీ భేటీ ఈసారి కూడా లేనట్లే.
ఈ ఆసియాన్లో మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమ్మిట్లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!