
2027 జనాభా లెక్కలకు కేంద్రం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం నోటిఫికేషన్ను జారీ చేసింది. 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ముందస్తు సర్వే 2025 నవంబర్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రక్రియ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అంతటా ఎంపిక చేసిన నమూనా ప్రాంతాల్లో గృహ జాబితా, గృహ గణనను కవర్ చేస్తుంది.
2027 జనాభా లెక్కల మొదటి దశ కోసం చేపట్టిన ముందస్తు సర్వేను సులభతరం చేయడానికి 1948 జనాభా లెక్కల చట్టంలోని నిబంధనలను పొడిగిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సన్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2027లో చేపట్టే జనాభా లెక్కలకు వచ్చే నెల నవంబర్ 10 నుండి 30 వరకు మందుస్తు సర్వే చేపట్టన్నట్లు తెలిపింది.
నివాసితులకు నవంబర్ 1 నుండి 7వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించింది. ప్రధాన సర్వేకు ముందు వారు డిజిటల్గా సమాచారాన్ని ఇవ్వడానికి వీలుకల్పించింది.
కాగా, 2027లో చేపట్టబోయే దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణకు ముందు ఈ ముందస్తు సర్వే చేపట్టడం ద్వారా కార్యాచరణలో ఎదరయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి, పద్దతులను మెరుగుపరచుకోవడానికి సహాయపడుఉందని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
వచ్చే నెలలో చేపట్టబోయే ముందస్తు సర్వేలో పౌరులు చురుగ్గా పాల్గొనాలని నారాయణ్ విజ్ఞప్తి చేశారు. ఈ ముందస్తు సమగ్ర సర్వే ద్వారా నిజ జనాభా గణనకు దోహదపడుతుందని ఆయన అన్నారు. జనాభా లెక్కలు 2027 రెండు దశల్లో నిర్వహించబడుతుందని, ఇందులో కులగణన కూడా చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.
More Stories
రోడ్లు సరిగా లేకుంటే పన్ను చెల్లించం..బెంగళూర్ ప్రజల అల్టిమేటం!
భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం.. పుతిన్
రాబోయే ఐదేళ్లలో నంబర్-1గా భారత ఆటోమొబైల్ పరిశ్రమ