
* శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకై శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లతో కలిసి హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు
ప్రధాని మోదీకి శ్రీశైలం ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన మంత్రికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం ప్రధాని మోదీ మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ స్వామివారిని తొలిసారి దర్శించుకున్నారు.
ప్రధాని వెంట చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాజ్ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర తెలిసేలా ఏర్పాటు చేసిన శిల్పాలను ప్రధాని పరిశీలించారు. అనంతరం శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని దాన్ని తాకి నమస్కరించారు. ధ్యానముద్రలో ఉన్న శివాజీతో పాటు అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్న మోదీ అనంతరం పుష్పాలు సమర్పించారు. కేంద్రం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని, స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందంటూ ట్రస్టు నిర్వాహకులను అభినందించారు. తర్వాత ప్రధాని మోదీ భ్రమరాంబ గెస్ట్హౌస్కు వెళ్లారు.
More Stories
భారత్, ఏపీ వేగం, సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గమనిస్తోంది
విశాఖ స్టీల్ కు ఏపీ ప్రభుత్వం రూ. 2,400 కోట్ల విద్యుత్ రాయితీ!
రెడ్లు బిసి మంత్రి సురేఖను అణచే కుట్ర… కుమార్తె ఆరోపణ