
టీవీకే అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తుకు సంబంధించిన నెలవారీ నివేదికను సీబీఐ కమిటీ ముందు సమర్పించాల్సి ఉంటుందని కూడా కోర్టు పేర్కొంది. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు డివిజన్ బెంచ్కు అప్పగిస్తామని కూడా కోర్టు పేర్కొంది.
“కమిటీ సిబిఐ దర్యాప్తును పర్యవేక్షిస్తుంది. తొక్కిసలాటకు కారణమైన ఏదైనా విషయంపై విచారణ చేపట్టవచ్చు. న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం అది దాని స్వంత విధానాన్ని రూపొందించుకుంటుంది” అని కోర్టు పేర్కొంది. “ఈ కోర్టులో ఏదైనా అవసరమైతే ఏ దశలోనైనా ఈ కోర్టును సంప్రదించే స్వేచ్ఛ ఉంటుంది” అని తెలిపింది. ఈ దుర్ఘటన తీవ్రమైన పరిణామాలు, పౌరుల ప్రాథమిక హక్కులపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇచ్చినట్లు జస్టిస్ జె మహేశ్వరి వ్యాఖ్యానించారు.
కరూర్ ఘటన దేశ మనస్సాక్షిని కదిలించిందని తెలిపారు. అన్ని పార్టీల ఆందోళనలను తొలగించడానికి సమగ్ర దర్యాప్తు అవసరం ఉందని అభిప్రాయపడ్డట్లు సుప్రీం తెలిపింది. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సిట్ దర్యాప్తును దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. తమ పార్టీ పట్ల సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
More Stories
మూడో తరగతి నుంచే ఏఐ!
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి