
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపి రూ.15 లక్షలు జరిమానా విధించింది. అలాగే విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.26 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు, ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవటం, విద్యార్థుల అటెండెన్స్ నిర్వహణలో అవకతవకలు, విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు నిలిపివేయడం వంటి ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నత విద్యా కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అలాగే వసూలు చేసిన రూ.26 కోట్లు చెల్లించాలని సెప్టెంబర్ 17న ఆదేశాలు జారీ చేసి.. ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. అయితే, మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో – ఛాన్సలర్ మంచు విష్ణు మీడియాలో వస్తున్న నిరాధార వార్తలను నమ్మవద్దని ఓ ప్రకటనలో కోరారు. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీ గురించి చేసినవి కేవంలం సిఫార్సులు మాత్రమేనన్న చెబుతూ తాము ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరుపుతోందని, ఈ సిఫార్సులకు వ్యతిరేకంగా మోహన్ బాబు యూనివర్సిటీకి అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా కాదని ఏపీ ఉన్నత విద్యా కమిషన్ దీనిని పోర్టల్లో పెట్టడం దురదృష్టకరమని చెప్పారు. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సులు సరికాదని మోహన్బాబు యూనివర్సిటీ గట్టిగా విశ్వసిస్తోందని మంచు విష్ణు స్పష్టం చేశారు.
విచారణ సమయంలో తాము పూర్తిగా సహకరించామని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తన నివేదికలో పేర్కొందన్న మంచు విష్ణు దానిని బట్టి ఎలాంటి తప్పు జరగలేదనే విషయం తెలుస్తుందని తెలిపారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా దీనిని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ఆరోపించారు.
కాగా, మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల అక్రమ ఫీజుల వసూలు, ఏపీఎస్ సి హెచ్ సి, ఎపిహెచ్ ఈఆర్ఎంఎంసీ, యుజిసి, ఏఐసీటీసీల నిబంధనలు అమలు చేయకపోవడం పై ఎపిహెచ్ ఈఆర్ఎంఎంసీ విచారణ చర్యలు నియంతణ్రకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ స్వాగతించింది. పభ్రుత్వం నియమించిన త్రిసభ్య కమిటీవిచారణ కేవలం ట్యూ షన్ ఫీజుల పరిశీలనకు మాత్రమే పరిమితమైందని పేర్కొంటూ అసలు అక్రమాలు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న హాస్టల్, మెస్ ఫీజులు ఏటా బిల్డింగ్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు తదితర అక్రమ చట్ట విరుద్ధంగా ఫీజుల వసూలు వ్యవహారంలోనే జరిగిందని ఆరోపించారు.
More Stories
రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని
భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు