
కాగా, కొన్ని రోజుల క్రితం సీజేఐ గవాయ్ ఓ కేసులో చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఖజురహోలోని ఏడు అడుగల విష్ణు విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని దాఖలు చేసిన కేసులో సీజేఐ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ కేసును ఆయన డిస్మిస్ చేస్తూ వెళ్లి ఆ దేవుడినే అడుక్కోవాలని సూచించారు.
విష్ణువుకు వీరభక్తుడిని అని చెప్పుకుంటున్నావు కాదా, వెళ్లి ఆ దేవుడినే ప్రార్థించుకో, అదో ఆర్కియాలజీ సైట్ అని, దానికి ఏఎస్ఐ పర్మిషన్ అవసరం ఉంటుందని ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యానించారు. ఖజురహో కేసులో సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. మతపరమైన భావాలను కించపరిచినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
అయితే ఆ వివాదానికి రెండు రోజుల తర్వాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మతాన్ని అమర్యాదపరచలేదని తెలిపారు. అన్ని మతాలను గౌరవిస్తానని, కేవలం సోషల్ మీడియాలోనే తన వ్యాఖ్యలు ప్రచారం అయినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐకి అండగా నిలిచారు. సోషల్ మీడియాల్లో కొన్ని సందర్భాల్లో ప్రతిచర్యలు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.
More Stories
బిహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14న కౌంటింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి
నవంబర్ 22లోగా బీహార్ ఎన్నికలు