క్రికెట్ మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’

క్రికెట్ మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’
* తన ఫీజ్ ను సాయుధదళాలకు, పహాల్గమ్ బాధితులకు ప్రకటించిన సూర్యకుమార్

ఆసియా కప్​ ఫైనల్స్​లో ఆదివారం పాకిస్థాన్​తో తలపడ్డ భారత్​ దాయాదిపై 5 వికెట్ల తేడాతో​ సాధించిన విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్​ సిందూర్​తో పోల్చారు. ఆట మైదానంలో ఆపరేషన్​ సిందూర్​ గెలిచిందని ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. “యుద్ధభూమిలోనూ, ఆటల మైదానంలోనూ ఆపరేషన్‌ సిందూర్‌. ఒక్కటే ఫలితం భారతే గెలిచింది. మన క్రికెటర్లకు అభినందనలు” అని ప్రశంసించారు.

దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత జట్టును అభినందించారు.“ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నందుకు టీమ్​ఇండియాకు నా హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్‌లో జట్టు ఏ మ్యాచ్‌లో ఓడిపోలేదు. ఇది ఆటలో దాని ఆధిపత్యాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో టీమ్​ఇండియా కీర్తిని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను” అని ఆమె కొనియాడారు.

ఈ విజయంపై హోమంత్రి అమిత్​షా ఎక్స్​ వేదికగా భారత ఆటగాళ్లను ప్రశంసించారు. “ఇదో అద్భుత విజయం. మన ఆటగాళ్ల శక్తి ప్రత్యర్థులను కుప్పకూల్చింది. ఏ రంగంలోనైనా భారత్ గెలవాల్సిందే” అని తెలిపారు.

2025 ఆసియా కప్ టైటిల్ విజయానికి భారత జట్టును నడిపించిన తర్వాత స్టార్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో తన మొత్తం ఆసియా కప్ మ్యాచ్ ఫీజును భారత సైన్యానికి ఆపరేషన్ సిందూర్ సమయంలో చేసిన కృషికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.  పహల్గామ్ బాధితుల కుటుంబాలకు డబ్బును కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు.

స్టార్ బ్యాటర్ తరచుగా పహల్గామ్ బాధితుల కుటుంబాలకు, భారత సాయుధ దళాలకు అండగా నిలుస్తున్నారు. టోర్నమెంట్ కోసం తన మ్యాచ్ ఫీజును ప్రతిజ్ఞ చేస్తానని ప్రకటించడం 35 ఏళ్ల వ్యక్తికి తన దేశం పట్ల ఉన్న అంకితభావం మరియు ప్రేమను ప్రదర్శిస్తూనే ఉంది.  “మన సాయుధ దళాలకు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధపడుతున్న బాధితుల కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి ఈ టోర్నమెంట్ నుండి నా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనల్లో ఉంటారు. జై హింద్,” అని సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు.

మరోవైపు దుబాయ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. వందేమాతరం, భారత్‌ మాతాకీ జై నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. తొలుత సిందూర్‌ పెట్టామని, ఇప్పుడు తిలకం పెట్టామంటూ తిలక్‌ వర్మను ప్రశంసించారు. భారత సరిహద్దుల్లో ఎల్ఓసి వద్ద సైనికులు క్రికెట్‌ అభిమానులతో కలిసి నృత్యాలు చేశారు. బిగ్‌స్క్రీన్ల వద్ద వేడుక చేసుకున్నారు.