
మరోవంక, అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ‘అధికారిక దర్యాప్తు’ చేపట్టాలని ఎయిర్ఇండియా డ్రీమ్లైనర్ పైలెట్లలో ఒకరైన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ కోరారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఎఎఐబి) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సుమీత్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని, దీంతో మరణం గురించి ఆలోచిస్తున్నాడని నివేదిక నుండి లీకైన సమాచారం తెలిపిందని, పౌరవిమానయాన కార్యదర్శి, ఎఎఐబి డైరెక్టర్ జనరల్కు రాసిన లేఖలో పుష్కరాజ్ పేర్కొన్నారు. ఈ అసత్యాలు తన ఆరోగ్యం, మానసిక స్థితిని ప్రభావితం చేశాయని, ఇవి కెప్టెన్ సబర్వాల్ ప్రతిష్టను దెబ్బతీశాయని తెలిపారు.
ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం భారత పౌరుడికి హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు అని ఆగస్టు 29 నాటి లేఖలో పేర్కొన్నారు. విమానం (ప్రమాదాలు మరియు సంఘటనల దర్యాప్తు) నియమాలు, 2017లోని నిబంధన 12 ప్రకారం ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం అధికారిక విచారణకు ఆదేశించాలని పుష్కరాజ్ డిమాండ్ చేశారు. విమాన ప్రమాదానికి గురైన సమయంలో, అటువంటి దర్యాప్తు నిర్వహించడం సముచితమని అనిపిస్తే, ఆ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక దర్యాప్తును చేపట్టాలని కోరారు.
తన కుమారుడు మానసిక ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను కూడా ఆయన తోసిపుచ్చారు. సుమిత్ విడాకులు తీసుకున్నాడని, ఇటీవల ఆయన తల్లి మరణించారని, దీంతో ఆయనకు జీవితంపై నిరాశ చెందారని నివేదిక పేర్కొనడాన్ని తప్పుపట్టారు.
More Stories
శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల కలర్ ఫొటో!
పంట వ్యర్థాల దహనంపై చర్యలు లేదా జైలు .. సుప్రీం