
ఉత్తరప్రదేశ్లోని బరేలీ ఇటీవల ఉద్రిక్తతలకు వేదికైంది. బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. స్థానిక ప్రజల్లో భయాందోళనలకు దారితీశాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసుపై గట్టి స్పందన వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుంటామని ఆమెకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
పోలీసులు చేరుకున్న విషయం తెలిసిన నిందితులు కాల్పులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణలో పోలీసులు కూడా ప్రతిదాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో నిందితులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన రవీంద్ర, అరుణ్లను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు తుపాకులు, భారీ మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటిని నిందితులు కాల్పులకు వినియోగించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ సాక్ష్యాలు కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ ఘటన తర్వాత యూపీ ప్రభుత్వం నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటోందని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా బరేలీ ఘటనలో పోలీసులు చూపిన వేగవంతమైన చర్యతో ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారన్న నమ్మకం మరింత బలపడింది.
More Stories
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
ఢిల్లీ యూనివర్సిటీలో ఎబివిపి అభ్యర్థులకు ట్రంప్ ప్రచారం!
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం