
మహిళల 48 కేజీల విభాగంలో కజకిస్తాన్ బాక్సర్ నజీమ్ రెండో రౌండ్లో 3-2తో మీనాక్షిపై పైచేయి సాధించినా, తొలి, మూడో రౌండ్లో మీనాక్షి 4-1తో ఆధిపత్యం చెలాయించింది. 4-1తో పసిడి పోరులో నెగ్గిన మీనాక్షి ప్రపంచ చాంపియన్గా అవతరించింది. మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన మీనాక్షి ప్రత్యర్థిపై వరుస పంచ్లతో ఆధిపత్యం చెలాయించింది. బ్యాక్ఫుట్పై ఉంటూ ప్రత్యర్థిపై దాడికి దిగింది. బలమైన డిఫెన్స్తో ప్రత్యర్థి పంచ్లను ఎదుర్కొని విజయం సాధించింది.
మహిళల విభాగంలో 80 కేజీల విభాగం సెమీఫైనల్లో పూజ రాణి పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ బాక్సర్ చేతిలో 1-4తో ఓటమి పాలైంది. దీంతో పూజ రాణి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 80 కేజీల విభాగం ఫైనల్ హోరాహోరీగా సాగింది.
ఇక మెన్స్ విభాగంలో ఈసారి భారత్కు ఒక్క పతకం రాలేదు. 2013 తర్వాత పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం ఇదే తొలిసారి. భారత స్టార్ బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ పోరాటం మాత్రం క్వార్టర్స్లోనే ముగిసింది. భారీ అంచనాలతో బరిలోకిదిగిన ఈ మాజీ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్లో 0-5తో బ్యూస్ నాజ్ కకిరోగ్లు (తుర్కియే) చేతిలో చిత్తయింది.
More Stories
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు
సరిహద్దుల్లో పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భారత్ – చైనా