
ఆగస్టు 15, 1947న భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో ఆనాడు దేశం మొత్తం మూడు రంగుల జెండా ఎగురవేస్తూ, ప్రజలు స్వేచ్ఛా ఉత్సవాలను జరుపుకుంటుండగా హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజ్యంలోని ప్రజలపై దమనకాండ కొనసాగుతూ వచ్చిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. చివరకు భారత ప్రభుత్వ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం రాజ్యంపై ఆపరేషన్ పోలో ప్రకటించి యుద్ధం ప్రారంభించవలసి వచ్చిందని తెలిపారు.
మిలటరీని, ట్యాంకర్లు, విమానాలు తోడై నిజాం ఆర్మీ రజాకర్లపై యుద్ధం ప్రారంభించడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో నిజాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు, మూడు రంగుల జెండా ముందు తలవంచి లొంగిపోయాడని చెప్పారు. దురదృష్టకరం ఏంటంటే ఈ చరిత్రను, వాస్తవాలను ఇప్పటి తరానికి తెలియకుండా, 75 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించేందుకు అంగీకరించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
1998లో విద్యాసాగర్ రావు నేతృత్వంలో బిజెపి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుకోవడానికి అంగీకరించలేదని, పైగా, అక్రమ నిర్బంధాలకు గురిచేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో గత మూడేళ్ళుగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నిజాం పాలనలో జరిగిన దమనకాండ, రాష్ట్ర విమోచన ఉద్యమానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియజేసేలా ఈ డిజిటల్ మ్యూజియం రూపొందించడం జరిగిందని చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు, పిఐబి అదనపు డైరెక్టర్ శృతి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన దాదాపు 50 ప్యానెల్లతో కూడిన నాలుగు రోజుల ప్రదర్శన 2025 సెప్టెంబర్ 14 నుండి 17 వరకు నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో తెరిచి ఉంటుంది.
More Stories
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
హనీట్రాప్లో ఓ ప్రముఖ యోగా గురువు