
ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు నివేదికలు చెబున్నాయి. బ్రిటన్కు వచ్చే వారిలో చాలామంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోంది. ఈ క్రమంలో ఈ హోటళ్ల వెలుపల గత కొన్ని నెలలుగా స్థానికుల నిరసనలు తెలుపుతున్నారు.
వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా, అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు చెబుతున్నారు. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు.
యాంటీ ఇమిగ్రేషన్ ఉద్యమానికి టామీ రాబిన్సన్ వంటి రైట్ వింగ్ కార్యకర్తలు నాయకత్వం వహిస్తున్నారు. వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే వంటి పార్టీలకు ఇది కీలక అజెండాగా మారింది. రాబిన్సన్ లాంటి నేతలు ఈ అంశాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. టామీ రాబిన్సన్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. యూకే ప్రభుత్వంలోని అనివీతిని తాను బయటపెడుతున్న టామీ పదే పదే చెబుతుంటారు.
అతనికి అమెరికా బిలియనీర్లు, ముఖ్యంగా ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల మద్దతు ఉందని ప్రచారంలో ఉంది. టామీ నిర్వహంచిన యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీకి ఎలాన్ మస్క్ వీడియో ద్వారా మద్దతు తెలపడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. బ్రిటన్లో ప్రజలు స్వేచ్ఛా హక్కులు వినియోగించడానికి భయపడుతున్నారు మస్క్ ఆ వీడియోలో వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది.
యాంటి ఇమిగ్రేషన్ ర్యాలీలో నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు. కొందరు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలు కూడా పట్టుకున్నారు. ప్రధాని కియర్ను విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. ‘సెండ్ దెం హోమ్’ అంటూ వలస వ్యతిరేక నినాదాలు వినిపించాయి. కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఉన్న టోపీలు ధరించారు.
More Stories
ఢాకా యూనివర్సిటీలో తొలిసారి ఇస్లామిస్ట్ ల విజయం
యునెస్కో జాబితాలో తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు
మార్చి 5న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలు