
ట్రంప్ సర్కార్ భారత ఐటి రంగం లక్ష్యంగా మరో కొత్త చట్టానికి పదును పెడుతుంది. ఈ చట్టంతో అమెరికాలో సేవల్ని అందిస్తున్న భారత ఐటి సంస్థలు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఐటి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. సెనేటర్ బెర్నీ మోరెనో గత వారం ప్రతిపాదించిన హోల్టింగ్ ఇంటర్నే షనల్ రిలోకేషన్ ఆఫ్ ఎంప్లారుమెంట్ (హెచ్ఇఆర్ఎ) చట్టం ఆమోదం పొందితే అమెరి కన్ కంపెనీలు విదేశీ కార్మికులను నియమించవని భారత ఐటి నిపుణులు హెచ్చరిస్తున్నారు..
హోల్టింగ్ ఇంటర్నేషనల్ రిలోకేషన్ ఆఫ్ ఎంప్లారుమెంట్ (హెచ్ఇఆర్ఎ) చట్టం అమెరికన్లకు ప్రయోజనం చేకూరేలా రూపొందించింది. ఆ దేశ కంపెనీలు విదేశాలకు అవుట్సోర్స్ చేస్తున్న పనిని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ప్రకారం, అమెరికా కంపెనీలు విదేశీ సంస్థలకు చేసే చెల్లింపులపై 25 శాతం సర్ఛార్జ్ విధించాలని ప్రతిపాదించింది. పన్ను ప్రయోజనాల కోసం అటువంటి చెల్లింపులను తగ్గించకుండా ఆ కంపెనీలను ఇది నిరోధిస్తుంది. దీని ఆర్థిక ప్రభావం తక్షణమే ఉంటుంది.
ఐటీ కాంట్రాక్టులను అవుట్సోర్సింగ్ చేయడం వల్ల గణనీయంగా ఖరీదైనవిగా మారతాయి. ఏజెన్సీలు, ఫ్రీలాన్సర్లతో సహా విదేశాలలో సర్వీస్ ప్రొవైడర్లు అమెరికాలో డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. కంపెనీలు ఈ చెల్లింపులను ట్యాక్స్ డిడక్షన్లో చూపించే హక్కును కోల్పోతాయి. దీని ద్వారా వసూలయ్యే ఆదాయాన్ని డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్కు తరలించి, అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ల కోసం వినియోగిస్తామని చట్టంలో ప్రతిపాదించారు.
283 బిలియన్ డాలర్ల విలువ కలిగిన భారత ఐటి పరిశ్రమ అనేక అమెరికన్ కంపెనీలకు అవుట్సోర్సింగ్ సేవల్ని అందిస్తోంది. ఇందులో ఆపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, సిస్కో, సిటి గ్రూప్, హోడిపోట్ వంటి సంస్థలున్నాయి. ఈ చట్టం ఆమోదం పొంది అమల్లోకి వస్తే అమెరికన్ కంపెనీల అవుట్సోర్సింగ్ విధానాలను మారుస్తాయి. భారతదేశంలోని ప్రధాన ఐటీ సంస్థలు తమ ఆదాయంలో సగానికి పైగా అమెరికా క్లయింట్ల నుండి సంపాదిస్తాయి.
100 డాలర్ల చెల్లింపుపై పన్ను విధించబడి, ఇకపై మినహాయింపు లభించకపోతే, అదనపు పన్ను,అదనపు ఆదాయ పన్నులను పరిగణనలోకి తీసుకుంటే, రైట్-ఆఫ్ కోల్పోవడం వల్ల వాస్తవ ఖర్చు దాదాపు 146 డాలర్ల వరకు పెరగవచ్చు. ఇది కాల్ సెంటర్లను మాత్రమే ప్రభావితం చేయదు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్ నుండి సైబర్ సెక్యూరిటీ, డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వరకు సేవలకు ప్రతిపాదిత చట్టం వర్తిస్తుంది.
ఇప్పటికే క్లయింట్లు కొన్ని ఒప్పందాలను ఆలస్యం చేస్తున్నారని లేదా పునరాలోచన చేస్తునట్లు తెలుస్తోంది. ఇది విదేశీ ఐటీ సేవలపై ఆధారపడే ఐటీ కంపెనీలపై ఖర్చుల్ని , అంతర్జాతీయ సేవా ఒప్పందాలపై పన్ను భారాన్ని పెంచుతుందని, ఫెడరల్, స్టేట్, లోకల్ పన్నులను కలిపితే కొన్నిసార్లు అవుట్సోర్సింగ్కు 60 శాతం వరకు పన్ను భారం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దీన్ని వ్వతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
“అమెరికాకు రిమోట్గా సేవలను అందించే ప్రత్యేక హక్కు కోసం దేశాలు వస్తువుల మాదిరిగానే చెల్లించాలి. దేశానికి అవసరమైన విధంగా పరిశ్రమలకు వర్తింపజేయండి,” అని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇటీవల పేర్కొనడం గమనార్హం. ఎగుమతి పన్ను ప్రయోజనాలను పరిమితం చేస్తున్న జిఎస్టి ఫ్రేమ్వర్క్ నుండి భారతదేశం ఇటీవల దాని మధ్యవర్తి నిబంధనను తొలగించింది. ఈ చర్య భారతీయ ఐటీ ఎగుమతిదారుల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది. కానీ ఈ బిల్లు ప్రజాదరణ పొందితే అది అమెరికా విధాన మార్పుల ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేయదు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు