
సెప్టెంబర్ 13-15 మధ్య మోదీ మిజోరాం, మణిపుర్, అసోం, పశ్చిమ బంగాల్, బిహార్లలో పర్యటిస్తారు. మోదీ మణిపుర్ పర్యటనను కాంగ్రెస్ స్వాగతించింది. ఇప్పటికైనా మోదీ పర్యటించడం సంతోషించదగ్గ విషయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. ఇన్నేళ్లు రణరంగంగా మారిన మణిపుర్లో మోదీ 3 గంటలు మాత్రమే పర్యటించడం ఆ రాష్ట్రాన్ని అవమానించడమే అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు రూ. 71,850 కోట్ల ఖరీదైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బీహార్లో జాతీయ మకానా బోర్డును ప్రారంభించనున్నారు. ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసేందుకు బీహార్లోని పుర్నియా విమానాశ్రయంలో కొత్త టర్మినల్ బిల్డింగ్ను ప్రారంభించనున్నారు. పుర్నియాలో సుమారు రూ. 36 వేల కోట్ల ఖరీదైన ప్రాజెక్టుల చేపట్టనున్నారు. మిజోరంలోని ఐజ్వాల్లో సుమారు రూ. 9 వేల కోట్ల ఖరీదైన డెవలప్మెంట్ పనులు ప్రారంభంకానున్నాయి. మిజోరంలో బైరాబి-సైరంగ్ మధ్య కొత్త రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు.
గౌహతిలో జరగనున్న డాక్టర్ భూపెన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొంటారు. అస్సాంలో సుమారు రూ.18,350 కోట్ల విలువైన పనులకు ప్రఝధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమెటెడ్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు గోలాఘాట్లో నుమాలిగఢ్ రిఫైనరీని ప్లాంట్ను ప్రారంభిస్తారు.
సోమవారం ఉదయం 9.30 గంటలకు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో 16వ ‘కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025’ ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం బీహార్కు వెళ్లి పూర్నియా ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ బిల్డింగును ప్రారంభిస్తారు. అనంతరం పూర్నియాలో రూ.36 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ బహరింగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత నేషనల్ మఖానా బోర్డును ప్రారంభిస్తారు.
More Stories
బిహార్ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించే లక్ష్యం
తొలి టెస్టులో భారత్ వెస్టిండీస్పై ఘన విజయం
ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచపటంలో పాక్ ఉండదు!