సగం మంది కూడా కానీ ఆదాయపన్ను రిటర్న్ దాఖలు

సగం మంది కూడా కానీ ఆదాయపన్ను రిటర్న్ దాఖలు
 
మదింపు సంవత్సరం 2025-26కు సంబంధించిన ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఇంకో 20 రోజులు మాత్రమే ఉంది. ఆలోపు దాఖలు చేయకపోతే జరిమానాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. కొన్నిసార్లు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు కూడా. గడువు దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా 50 శాతం మంది సైతం తమ రిటర్నులను దాఖలు చేయకపోవడం గమనార్హం. 
 
గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా ఆలస్యంగా రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఆర్జించిన ఆదాయాలకు సంబంధించిన రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. గతేడాది 9 కోట్లకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. ఆదాయపన్ను విభాగం అధికారిక వెబ్ సైట్ గణాంకాల ప్రకారం ఆగష్టు 25 నాటికి మొత్తం 3,67,800 రెతుర్నులు దాఖలు అయ్యాయి. 
 
అందులో 3,54,25,015 రిటర్నులను సరిచూడగా, వాటిల్లో 2,29,72,011 ఐటీఆర్లను ట్యాక్స్ విభాగం ప్రాసెసింగ్ చేసింది. వారందరికీ రీఫండ్ జారీ చేస్తున్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువ మంది తమ రిటర్నులను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకో దాదాపు 6 కోట్ల మంది వరకు దాఖలు చేయాల్సి ఉంది. ఈసారి ఈ సంఖ్య తగ్గవచ్చన్న అంచనాలు ఉన్నాయి. 
 
కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం గత మేలో ఐటిఆర్ దాఖలు గడువును పొడిగించింది.  సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేసేందుకు జూలై 31 వరకు గడువు ఉంటుంది. అయితే ఈసారి ఐటీఆర్ ఫామ్స్, యుటిలిటీల విడుదలో జాప్యం కారణంగా రిటర్నుల గడువు పొడగించాల్సి వచ్చింది. 
 
ఈ ఏడాది సెప్టెంబర్ 15, 2025 వరకు అవకాశం ఇచ్చారు. తమ అకౌంట్లు ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు ఇది వర్తిస్తుంది. అయితే, ఆడిట్ అవసరమైన ట్యాక్స్ పేయర్లకు ఈ గడువు అక్టోబర్ 31, 2025 వరకు ఉంటుంది. ఈసారి ఐటీఆర్ ఫామ్స్, ఎక్సెల్ యుటిలిటీలను ఆలస్యంగా విడుదల చేయడం ట్యాక్స్ పేయర్లను ఆందోళనకు గురి చేస్తోంది. 

 

గత వారంలోనే ఐటీఆర్ 7 యుటిలిటీలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు ఐటీఆర్ ఫైలింగ్ వెబ్‌సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ఐటీఆర్ గడువు పొడిగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇవ్వాలని ట్యాక్స్ పేయర్లు, సీఏలు కోరుతున్నారు.