
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నాలుగు కొత్త రైల్వే ప్రాజెక్టులు, అమెరికాతో వాణిజ్య వ్యవహారాలు, టారిఫ్లు, ఆర్థిక ప్రణాళికలపై దృష్టి సారించింది. మొత్తం మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రూ. 12,328 కోట్ల ఖర్చుతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కచ్లోని దూర ప్రాంతాల కలయిక, పర్యాటకానికి ఊపిరినిచ్చేలా ఈ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు.
రణ్ ఆఫ్ కచ్, హరప్పా స్థలం ధోలవిరా, కోటేశ్వర్ ఆలయం, నారాయణ సరోవర్, లాఖ్పట్ కోటకు రైలు సదుపాయం కల్పించ సంకల్పించారు. దీని ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 251 లక్షల మానవ పని దినాల ఉపాధి కలుగుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల బొగ్గు, సిమెంట్, స్టీల్, కంటైనర్లు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పెద్ద మేలు జరుగుతుంది. లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి.
పర్యావరణ హితం, సిఓ2 ఉద్గారాల నియంత్రణ కలుగుతుంది. కర్ణాటక, తెలంగాణ, బిహార్, అసోం రాష్ట్రాలకు మల్టీ-ట్రాకింగ్ ద్వారా కనెక్టివిటీ పెంపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల 13 జిల్లాలు లబ్ధి పొందుతాయి. 565 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల కలయిక జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 360 కోట్ల కిలోల సిఓ2 తగ్గింపు జరుగుతుంది. ఇది 14 కోట్ల చెట్లు నాటిన దానికి సమానమైన ప్రయోజనం ఇస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతీయ ఎగుమతులపై 50% టారిఫ్లు విధించిన నేపథ్యంలో, ఈ సమావేశంలో దీని ప్రభావాలను అంచనా వేసి, తీసుకోవాల్సిన ప్రణాళికల్ని రూపొందించారు. ప్రధాన మంత్రి స్వనిధి యోజన పునర్వ్యవస్థీకరణ, విస్తరణ గురించి క్యాబినెట్ చర్చించింది. ఈ పథకాన్ని 31 మార్చి 2030 వరకు విస్తరించారు. మొత్తం బడ్జెట్: రూ. 7,332 కోట్లు. ఈ పథకం కింద 1.15 కోట్లకు పైగా వీధి వ్యాపారుల ప్రయోజనం పొందుతారు. ఇది చిన్న వ్యాపారులను ఆత్మనిర్భర్గా మార్చడానికి సహాయపడుతుంది. చిన్న వ్యాపారులకు రుణాలు, ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి