
హిందూ ధర్మ పరిరక్షణకు మనమంతా పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ కన్వీనర్ ఆకారపు కేశవరాజు పిలుపునిచ్చారు. వీహెచ్పీ స్థాపించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన వీహెచ్పీ స్థాపన దివస్ సభలో పాల్గొన్నారు.
ముందుగా వీహెచ్ పీ కార్యదర్శి అయోధ్య రవీందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ దేశంలో మత మార్పిడిలను అడ్డుకునే శక్తి వీహెచ్ పీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను, హిందు కుటుంబాలను ముస్లింలుగా మారుస్తున్న హిందూ వ్యతిరేక శక్తులను అడ్డుకుంటున్నామని తెలిపారు.
దేశంలోని సాధు సంతుల ప్రోత్భలంతో వీహెచ్పీని 1984లో స్థాపించిన్నట్లు చెప్పారు. ప్రపంచ హిందూ సమ్మేళనం పేరుతో గొప్ప విజయంగా ముందుకు సాగుతుందని పేర్కొంటూ అయోధ్య రామాలయ కలను సాకారం చేసుకున్నామని గుర్తు చేశారు. హిందూ ధర్మం కట్టుబొట్టు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం హిందువులను జాగృతం చేస్తున్నామని తెలిపారు.
ప్రతి బస్తీ, ప్రతి ఇంటింటి వరకు హిందూ సమాజంను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. యువత భజరంగ్ దళ్ లో చేరి హిందుత్వ రక్షణ ధ్యేయంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం, కార్యదర్శి మునిగాల సంపత్, భజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ ముక్కె సంపత్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు