నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తిగత పోటీ కాదని తెలిపారు. “ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం ఒక వ్యక్తి గురించి కాకుండా, పార్లమెంట్ నిష్పాక్షికంగా నడవడం, విభిన్న అభిప్రాయాలను గౌరవించడం, ప్రజాస్వామ్య సంస్థలు స్వతంత్రంగా, న్యాయంగా ప్రజల కోసం పనిచేయడం వంటి భారత్ ఆలోచనను పునరుద్ధరించడం” అని చెప్పారు.
“ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే పక్షంలో నిష్పాక్షికత, గౌరవం, సంభాషణ, మర్యాదతో నా బాధ్యతలను నిర్వర్తిస్తా. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి నా నామినేషన్ దాఖలు చేయడం గౌరవంగా భావిస్తున్నా. రాజ్యాంగంపై విశ్వాసంతో, ప్రజలపై ఆశతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. మన ప్రజాస్వామ్య స్పూర్తి ఎల్లప్పుడూ మనందరినీ నడిపిస్తుందని నమ్ముతున్నా. రాజ్యసభ ఛైర్మన్గా ఉపరాష్ట్రపతి, ప్రజాస్వామ్య పార్లమెంటరీ సంప్రదాయాలను రక్షించే బాధ్యత కలిగి ఉంటా” అని హామీ ఇచ్ఛారు.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కూడా బుధవారమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పార్టీ నేతలు హాజరయ్యారు.

More Stories
డిసెంబర్ 6న భారీ ఉగ్రదాడికి ఉమర్ కుట్ర
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు
ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ!