
పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై పోరాటంలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ భారత్కు సంఘీభావం ప్రకటించారు. భారత ప్రభుత్వం, ప్రజలతో తమ దేశం నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట్వర్యూలో చో హ్యూన్ దక్షిణ కొరియా ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము చాలా కఠినంగా, దృఢంగా ఉన్నామని తెలిపారు. ఏదైనా ఉగ్రవాద దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెబుతూ భారత ప్రభుత్వం, భారత ప్రజలతో ఉంటామని తెలిపారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ఆపరేషన్ సిందూర్ను చేపట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22 పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు 26 మంది దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చో హ్యూన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని దక్షిణ కొరియా ఖండించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సియోల్ను సందర్శించిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో చాలా మంచి సమావేశాలు జరిగాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
జైశంకర్ మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని దక్షిణ కొరియా ఖండించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా పార్లమెంటరీ ప్రతినిధి బృందం సియోల్కు వెళ్ళినప్పుడు, వారు చాలా మంచి సమావేశాలు జరిగాయని నేను భావిస్తున్నాను. మీరే వారిని కలవడానికి ప్రయత్నించారు. దీన్ని తాము అభినందిస్తున్నాం” అని తెలిపారు.
శనివారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో జరిగిన సమావేశం బాగుందని చో హ్యూన్ చెప్పారు. 2015 నుంచి 2017 వరకు ఢిల్లీలో రాయబారిగా తన పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో గణనీయమైన మార్పులు జరిగాయని పేర్కొన్నారు.
గత 10 సంవత్సరాలలో మంచి మార్పులు జరిగాయని, ఢిల్లీకి తిరిగి రావడం చాలా గొప్పగా అనిపిస్తుందని చో హ్యూన్ తెలిపారు. పదేళ్ల కిందట ఈ నగరానికి వచ్చినప్పుడు, భారతదేశ సంస్కృతి షాక్ అయ్యానని, భారతదేశంలో కొరియా రాయబారిగా పనిచేయడం తనకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. 2015-18 వరకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన ఎస్ జైశంకర్ను కలిశానని గుర్తు చేసుకున్నారు.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి