
తాజాగా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకవేళ పాకిస్థాన్ ఓడిపోయే దశలో ఉంటే. అప్పుడు తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని అణు హెచ్చరికలు చేశారు. ఫ్లోరిడాలోని థంపాలో జరిగిన అమెరికా మిలిటరీ అధికారుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పెంటగాన్ మాజీ అధికారి స్పందిస్తూ అమెరికా నేలపై పాకిస్థాన్ చేసిన బెదిరింపులు అమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
సమస్యాత్మక కోణంలో ఉగ్రవాదాన్ని అమెరికా చూస్తుందని, అనేక మంది ఉగ్రవాదుల ఐడియాలజీ అర్థం కాదని, సూట్ ధరించిన ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు ఆసిమ్ మునీర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ వ్యాఖ్యల తరహాలో ఫీల్డ్ మార్షల్ ప్రకటన ఉన్నట్లు రూబిన్ తెలిపారు. పాకిస్థాన్లో ఉన్న అణ్వాయుధ కేంద్రాలను అమెరికా సీల్ దళాలు స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు.
పాకిస్థాన్ను నాన్-నాటో సభ్య దేశంగా చూడాలని, యూఎస్ సెంట్రల్ కమాండ్ సభ్యదేశంగా చూడవద్దని రూబిన్ హితవు చెప్పారు. ఆసిమ్ మునీర్కు ఎప్పటికీ యూఎస్ వీసా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మరోవంక, పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో పాకిస్థాన్లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతూ అక్కడి సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది.
More Stories
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం
వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో భారీ ప్రదర్శన